News February 4, 2025

గంజాయి కేసులో 3 నెలల జైలుశిక్ష: సీఐ

image

గంజాయి అక్రమ తరలింపు కేసులో ఓ వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ JFCM కోర్టు న్యాయమూర్తి అనంతలక్ష్మి సోమవారం తీర్పు ఇచ్చారు. ఆసిఫాబాద్ సీఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. 2021లో ASFమండలం గోండుగూడకి చెందిన మాడావి దేవ్రావు కిలో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. సాక్ష్యాధారాలు పరిశీలించి, నేరం రుజువు కావడంతో నిందితుడికి 3 నెలల జైలుశిక్ష రూ.5 వేల జరిమానా విధించారు.

Similar News

News February 15, 2025

కర్నూలులో బర్డ్ ఫ్లూ.. ‘ఆందోళన అవసరం లేదు’

image

కర్నూలులో బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని నరసింహారావు పేటను రెడ్ జోన్‌గా గుర్తించి చికెన్, గుడ్ల అమ్మకాలను నిలిపివేశామని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో చికెన్, గుడ్ల అమ్మకం కొనసాగుతుందన్నారు. చికెన్‌ను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు.

News February 15, 2025

తాడికొండలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

తాడికొండ మండల పరిధిలోని బేజాత్ పురం గ్రామ పొలాల్లో గుర్తుతెలియని వృద్ధురాలి (70) మృతదేహం లభ్యమైంది. తాడికొండ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘటనా స్థలానికి ఎస్ఐ జైత్యా నాయక్ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వీఆర్వో రవిబాబు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. వృద్ధురాలి ఆచూకీ తెలిసినవారు తాడికొండ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు.

News February 15, 2025

జయలలిత బంగారు ‘ఖజానా’!

image

మాజీ సీఎం జయలలిత ఆస్తులు, పత్రాలను తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు. ఇందులో 27 కిలోల బంగారం, 1,116 కిలోల వెండి, రత్నాలు, వజ్రాభరణాలు, 10 వేల చీరలు, 750 జతల చెప్పులు, 1,672 ఎకరాల భూముల పత్రాలు, ఇళ్ల దస్తావేజులు, 8,376 పుస్తకాలు ఉన్నాయి. వీటన్నింటిని 6 ట్రంకు పెట్టెల్లో తీసుకువచ్చి అప్పగించారు. వీటి విలువ ప్రస్తుతం రూ.4,000 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

error: Content is protected !!