News March 20, 2025
గంజాయి నిర్మూలనకు కృషి చేయండి: అల్లూరి కలెక్టర్

అల్లూరి జిల్లాలో గంజాయి నిర్మూలనకు సంబంధిత శాఖలన్నీ కలసి కృషి చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. సోమవారం పాడేరులోని కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎన్కార్డ్ (NCORD) సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ ద్వారా డ్రోన్ల సహాయంతో 20 సంవత్సరాల డేటా ఆధారంగా సుమారు 82 ఎకరాలలో గంజా సాగును గుర్తించామన్నారు. ఆయా రైతులకు గంజాయి వల్ల కలుగు నష్టాలు, దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News October 21, 2025
VZM: పండగ పేరిట పన్ను దోపిడీ?

విజయనగరం జిల్లాలో రెగ్యులర్ టాక్స్ పేయర్స్ అయిన పలువురు బాణసంచా వ్యాపారులు రికార్డుల్లో రూ.కోటి రిటర్న్ మాత్రమే చూపించి, రూ.4 కోట్ల టర్నోవర్ను దాచిపెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. లావాదేవీలు, అండర్-ఇన్వాయిసింగ్ ద్వారా GST స్వాహా చేస్తున్నారన్నారు. గోదాముల్లోని క్లోజింగ్ స్టాక్లో లక్షల విలువైన సరుకు లెక్కల్లో చూపడం లేదని, బోగస్ ITC క్లెయిమ్లు, E-Way బిల్ ఎగవేతలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
News October 21, 2025
ప్రజల కోసం పదవి త్యాగానికి సిద్ధం: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ప్రజలకు మంచి జరుగుతుందంటే ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధమే” అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇస్తే తీసుకుంటానని, లేదంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.
News October 21, 2025
పెద్దపల్లి: ‘ప్రజలకు పారదర్శక వైద్యం అందించాలి’

పెద్దపల్లి వరుణ్ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వాణిశ్రీ, రికార్డులు పరిశీలించి, సేవల నాణ్యతను సమీక్షించారు. ఫీజులు ధరల పట్టిక ప్రకారం వసూలు చేయాలని, అందించే సేవల వివరాలు రిసెప్షన్ వద్ద బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. ప్రజలకు పారదర్శక వైద్యం అందించాలన్నారు. డా. శ్రీరాములు, డా.కె.వి. సుధాకర్ రెడ్డి ఈ తనిఖీలో పాల్గొన్నారు.