News March 20, 2025
గంజాయి నిర్మూలనకు కృషి చేయండి: అల్లూరి కలెక్టర్

అల్లూరి జిల్లాలో గంజాయి నిర్మూలనకు సంబంధిత శాఖలన్నీ కలసి కృషి చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. సోమవారం పాడేరులోని కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఎన్కార్డ్ (NCORD) సమావేశం నిర్వహించారు. పోలీస్ శాఖ ద్వారా డ్రోన్ల సహాయంతో 20 సంవత్సరాల డేటా ఆధారంగా సుమారు 82 ఎకరాలలో గంజా సాగును గుర్తించామన్నారు. ఆయా రైతులకు గంజాయి వల్ల కలుగు నష్టాలు, దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News September 17, 2025
రూ.100 కోట్ల క్లబ్లోకి ‘మిరాయ్’

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. మొదటి 4 రోజుల్లో రూ.91.45 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించగా విశ్వ ప్రసాద్ నిర్మించారు.
News September 17, 2025
జగిత్యాల: జడ్జి, ఎస్పీని కలిసిన అడిషనల్ కలెక్టర్

జగిత్యాల జిల్లా జడ్జి రత్న పద్మావతిని, ఎస్పీ అశోక్ కుమార్ ను అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాజా గౌడ్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటీవల నూతనంగా అడిషనల్ కలెక్టర్ గా నియమితులైన ఆయనకు వారు శుభాకాంక్షలు తెలిపారు.
News September 17, 2025
జగిత్యాల: నవంబర్లో డీఈఐఈడీ, డీపీఎస్ఈ పరీక్షలు

2024-26 బ్యాచ్కు చెందిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లోమా ఇన్ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం పరీక్షలు నవంబర్ లో నిర్వహించబడతాయని జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. లేట్ ఫీజు లేకుండా ఈనెల 22లోగా ప్రిన్సిపల్కు ఫీజులు చెల్లించవచ్చన్నారు. 50 రూపాయల లేట్ ఫీజ్ తో ఈనెల 29 వరకు ఫీజులు చెల్లించవచ్చన్నారు. ఆన్లైన్ లో అయితే లేట్ ఫీజు లేకుండా 23లోగా లేట్ ఫీజు తో 30లోగా చెల్లించాలన్నారు.