News September 18, 2024
గంజాయి నిర్మూలనపై 100 రోజులు ప్రణాళిక: DGP

ఏలూరు రేంజ్ పరిధిలోని వివిధ జిల్లాల ఎస్పీలతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు బుధవారం ఏలూరులో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలనకు 100 రోజులు ప్రణాళిక రూపొందించామన్నారు. గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రజలకు, చిన్న పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. పోలీసుల పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు.
Similar News
News November 25, 2025
నిబంధనలు మీరితే కఠిన చర్యలు: కలెక్టర్

మందుగుండు సామాగ్రి తయారీ, నిల్వల విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నాగరాణి హెచ్చరించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో తయారీదారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. భద్రతా ప్రమాణాలను విధిగా పాటించాలన్నారు. అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా తయారీ లేదా నిల్వలు చేపడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News November 25, 2025
ధాన్యం కొనుగోలుపై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని ప.గో జాయింట్ కలెక్టర్ రాహుల్ సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, రవాణా, తూకంలో సమస్యలుంటే 81216 76653, 1800 425 1291 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేశామని, రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
News November 25, 2025
కంటి ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు: కలెక్టర్

పంచేంద్రియాల్లో నయనాలు ప్రధానమైనవని, ఉద్యోగులు కంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. చూపు విషయంలో అశ్రద్ధ తగదని, వైద్యుల సలహాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆమె పేర్కొన్నారు.


