News November 29, 2024
గంజాయి రవాణాపై 289 కేసులు: DIG

గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్నా 1972 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని డీఐజీ గోపీనాథ్ జెట్టీ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఇప్పటివరకు గంజాయి రవాణాపై 289 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు డైనమిక్ చెక్ పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 స్పెషల్ టీములను గంజాయి రవాణా అరికట్టేందుకు నియమించాన్నారు.
Similar News
News October 16, 2025
VZM: రైలులో గంజాయితో ఇద్దరు అరెస్టు

ఒడిశాలోని మునిగుడ నుంచి కేరళ తరలిస్తున్న మూడు కిలోల గంజాయి పట్టుకున్నట్ల రైల్వే ఎస్ఐ బాలాజీరావు చెప్పారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ నుంచి విజయనగరం రైల్వే స్టేషన్ మధ్యలో ఏర్నాకులం రైలులో తనిఖీలు చేస్తుండగా కేరళకు చెందిన సుని, గోవిందరాజు నుంచి మూడు కిలోల గంజాయి సీజ్ చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. గంజాయి నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రైల్వే పోలీసులు చెప్పారు.
News October 15, 2025
విజయనగరం జిల్లా రైతులకు విజ్ఞప్తి

పత్తి, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించవద్దని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి రవికిరణ్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంవత్సరానికి పత్తి ధర క్వింటాల్కు రూ.8110, మొక్కజొన్న క్వింటాల్కు రూ.2400గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అక్టోబరు 21 తర్వాత జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News October 15, 2025
VZM: ఏపీఐఐసీ-పారిశ్రామిక భాగస్వామ్య మాసం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలో ఏపీఐఐసీ-పారిశ్రామిక భాగస్వామ్య డ్రైవ్ పేరిట నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పోస్టర్లను కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తన ఛాంబర్లో బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలు నవంబర్ 15 వరకు కొనసాగనున్నాయని APIIC ప్రతినిధులు తెలిపారు.