News December 25, 2024
గంజాయి రవాణా పై కఠినంగా వ్యవహారించాలి: VZM SP
విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షను ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ.. గంజాయి రవాణ నియంత్రణలో కఠినంగా వ్యవహరించాలని, రవాణకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తూనే, వారికి గంజాయి సరఫరా చేసిన వ్యక్తులు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని గుర్తించాలన్నారు.
Similar News
News January 17, 2025
గడ్డం ఉమ ట్వీట్కు లోకేశ్ రిప్లై
వైఎస్ జగన్ అభిమాని గడ్డం ఉమ ట్విటర్ వేదికగా కోరిన సాయానికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విజయనగరం చిన్నారి శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారని, ట్రీట్మెంట్కు రూ.10 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. పేద కుటుంబం కావడంతో చిన్నారి వైద్యానికి సాయం అందించాలంటూ ఆమె ‘X’లో లోకేశ్ను కోరారు. దీనికి స్పందించిన లోకేశ్ చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
News January 17, 2025
పార్వతీపురం: పండగ జరుపుకుని వెళ్తూ అనంత లోకాలకు
పార్వతీపురం మన్యం జిల్లా అల్లు వాడకు చెందిన లోలుగు <<15173201>>రాంబాబు<<>>(44) అతని కుటుంబంతో కలిసి పండగ చేసుకుని తిరిగి ఉద్యోగ నిమిత్తం తిరిగి ప్రయాణమయ్యారు. అతని భార్య ఉమాదేవి పాచిపెంటలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. బైక్పై వెళ్తుండగా రాంబాబు, పెద్ద కుమారుడు మోక్ష శ్రీహాన్ (5) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చిన్న కుమారుడు సూర్య శ్రీహాన్, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.
News January 17, 2025
VZM: కానిస్టేబుల్ ఎంపికలు.. 185 మంది గైర్హాజరు
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య ఎంపిక ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 415 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 185 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.