News July 4, 2024

గంజాయి సాగు చేయకుండా కార్యాచరణ: మంత్రి సంధ్యారాణి

image

గంజాయి సాగు చేయకుండా కార్యాచరణ సిద్ధం చేస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. హోం మంత్రి అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకోవల్సిన పటిష్ఠమైన చర్యలపై సబ్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించారు.

Similar News

News December 22, 2025

విజయనగరంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు తమ సమస్యలతో అర్జీలు సమర్పించాలని, పాత అర్జీల స్లిప్పులు తీసుకురావాలన్నారు. మండలాలు, మున్సిపాలిటీల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగుతుందని తెలిపారు.

News December 22, 2025

విజయనగరంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు తమ సమస్యలతో అర్జీలు సమర్పించాలని, పాత అర్జీల స్లిప్పులు తీసుకురావాలన్నారు. మండలాలు, మున్సిపాలిటీల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగుతుందని తెలిపారు.

News December 21, 2025

VZM: టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున

image

విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల లక్ష్మివరప్రసాద్‌ని నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ప్రకటన విడుదల చేసింది. కిమిడి నాగార్జున జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండంగా.. ప్రసాదుల లక్ష్మివరప్రసాద్ యాదవ సంఘం కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు.