News April 4, 2025
గంజాయి సాగు, రవాణా అరికట్టాలి: ఎస్పీ

స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. శుక్రవారం పాడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. గంజాయి కేసుల్లో పరాయిలో ఉన్న ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు విస్తృతంగా వినియోగించి, గంజాయి సాగు, రవాణా అరికట్టాలని సూచించారు. డైనమిక్ చెకింగ్ చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News December 5, 2025
అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ 8కి వాయిదా

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కల్తీకి ఉపయోగించిన కెమికల్స్లను సరఫరా చేసిన ఏ19 అజయ్ కుమార్ సుగంధ్ బెయిల్ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అతనికి బెయిల్ ఇస్తే దర్యాప్తు సరిగ్గా సాగదని ప్రాసిక్యూటర్ వాదించారు. దీంతో బెయిల్ పిటిషన్ 8వ తేదీకి నెల్లూరు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
News December 5, 2025
RR: ఉమెన్స్ షూటింగ్ బాల్ ఎంపికలు రేపే

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహిళలు, బాలికల కోసం రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా ఉమెన్స్ ఓపెన్ టు ఆల్ షూటింగ్ బాల్ ఎంపికలను నిర్వహించనున్నారు. ఈ నెల 6వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు తాండూరు పట్టణంలోని సెంట్ మార్క్స్ స్కూల్లో ఎంపికలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారిణులు తమ బోనఫైడ్, ఆధార్ కార్డుతో హాజరుకావాలని కోరారు.
News December 5, 2025
రెండో దశ ల్యాండ్ పూలింగ్కు రైతులు సానుకూలం: నారాయణ

AP: రాజధాని అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్కు రైతులు సానుకూలంగా ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని CM ఆదేశించినట్లు చెప్పారు. CRDA సమావేశంలో రూ.169కోట్లతో లోక్ భవన్, రూ.163కోట్లతో జ్యుడీషియల్ భవన్కు పాలనా అనుమతులు ఇచ్చామన్నారు. రూ.532 కోట్లతో నేషనల్ హైవేకు అనుసంధానం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు ఆమోదం తెలిపామని ఆయన వివరించారు.


