News April 4, 2025

గంజాయి సాగు, రవాణా అరికట్టాలి: ఎస్పీ

image

స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. శుక్రవారం పాడేరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. గంజాయి కేసుల్లో పరాయిలో ఉన్న ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. డ్రోన్లు విస్తృతంగా వినియోగించి, గంజాయి సాగు, రవాణా అరికట్టాలని సూచించారు. డైనమిక్ చెకింగ్ చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News November 18, 2025

GWL: ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి- నుషిత

image

గద్వాల జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువే ఎస్సీ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నుషిత మంగళవారం పేర్కొన్నారు. కొత్త పథకం కింద 5 నుంచి 8వ తరగతి విద్యార్థులు, రాజీవ్ విద్యా దీవెన పథకం కింద 9,10వ తరగతి విద్యార్థులు డిసెంబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ ఖాతా ఆధార్ తో లింక్ చేసుకోవాలన్నారు.

News November 18, 2025

వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి: నిర్మల్ ఎస్పీ

image

శీతాకాలం నేపథ్యంలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న పొగమంచు వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. బైక్‌లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రహదారిపై ఓవర్ టేక్‌లు చేయకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. సాధ్యమైనంత వరకు రాత్రి, తెల్లవారుజాముల్లో ప్రయాణాలు చేయవద్దన్నారు.

News November 18, 2025

ఢిల్లీలో అవార్డు అందుకున్న నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో 2024-25 సంవత్సరంలో భూగర్భ జలాల పెంపుకు చేపట్టిన చర్యలను అభినందిస్తూ కేంద్రం అవార్డు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి పాటిల్ చేతులమీదుగా ఆ అవార్డును అందుకున్నారు. భూగర్భ జలాల పెంపు కోసం వర్షాన్ని ఒడిసిపట్టేందుకు జిల్లాలో 3,495 ఇంకుడు గుంతలు, 856 ఫామ్ పాండ్స్‌తో కలిపి 5,502 భూగర్భ జలాల రీఛార్జ్ పనులు చేసినందుకు అవార్డు లభించినట్లు సమాచారం.