News March 29, 2024
గంటా రాజకీయ ప్రస్థానం

భీమిలి టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఖరారైన గంటా శ్రీనివాసరావుకు ఓటమి ఎరుగని నేతగా పేరుంది. 1999 ఆయన అనకాపల్లి నుంచి మొదటిసారిగా టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2004లో చోడవరం నుంచి, 2009లో ప్రజారాజ్యం తరపున అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడంతో మంత్రి అయ్యారు. 2014లో మళ్లీ టీడీపీలో చేరిన ఆయన భీమిలి నుంచి, 2019లో విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Similar News
News December 9, 2025
విశాఖలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం చంద్రబాబు ఈనెల 12న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మధురువాడ ఐటీ హిల్స్పై సందర్శించిన ఆయన కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్న ప్రాంతంలో ఏర్పాట్లు ఎక్కడివరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. సీఎం చేరుకోనున్న క్రమంలో అక్కడి హెలిప్యాడ్ను పరిశీలించారు. ఆయన వెంట జేసీతో పాటు ఏపీఐఐసీ అధికారులు ఉన్నారు.
News December 9, 2025
విశాఖలో 16 అనధికార, నిర్మాణ భవనాల తొలగింపు

జీవీఎంసీ కమీషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలో విశాఖలో ఆగస్టు 31 తర్వాత నిర్మించిన అనధికార భవనలను తొలగిస్తున్నట్ల జీవీఎంసీ ఛీప్ సిటీ ప్లానర్ ప్రభాకర్ రావు తెలిపారు. జోన్-2లో 3, జోన్-3లో 2, జోన్-4లో 3, జోన్-5లో 4, జోన్-6లో 3, జోన్-8లో ఒక నిర్మాణంతో కలిపి మొత్తం 16 అనధికార నిర్మాణాలను రెండు రోజుల నుంచి తొలగించినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన బీపీఎస్ను వినియోగించుకోవాలన్నారు.
News December 9, 2025
విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న CM

CM చంద్రబాబు ఈనెల 12న విశాఖలో పర్యటించనున్నారు. ముందుగా మధురవాడ ఐటీ సెజ్ హిల్-2లో ప్రముఖ IT కంపెనీ కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వీఈఆర్ సమావేశానికి హాజరై, వివిధ అభివృద్ధి అంశాలపై సమీక్ష చేస్తారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.


