News August 8, 2024

గండికోట ప్రాజెక్టుకు కృష్ణా జలాలు రాక

image

గండికోట ప్రాజెక్టుకు ఈనెల 11న కృష్ణాజలాలు రానున్నట్లు జి.ఎన్.ఎస్..ఎస్. సీఈ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. గురువారం గండికోట ప్రాజెక్టును జి.ఎన్.ఎస్.ఎస్ అధికార బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా గండికోట గేట్లను, సొరంగాన్ని వారు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జి.ఎన్.ఎస్.ఎస్ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News January 4, 2026

జాతీయస్థాయి అండర్-14 వాలీబాల్ పోటీలు.. ఏపీ టీం ఇదే.!

image

69వ జాతీయస్థాయి అండర్-14 బాలికల వాలీబాల్ పోటీలు జమ్మలమడుగులో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో ఏపీ టీం ఇదే.!
C. నవీన, R. మనస్వి, Y. నందిని, K. శ్యామలాదేవి, అవంతి, V. జాస్మిన్, P. లాస్య, M. అశ్వని, K. జెసికా, V. వందన, K. తేజస్వి, J. నాగూర్‌బి. కోచ్ ఎం. దేవిక, మేనేజర్‌గా బీవీ రమణయ్య వ్యవహరించనున్నారు. ఈ పోటీలకు జమ్మలమడుగులోని బాలికల ఇంటర్ కాలేజీ ఆతిథ్యం ఇవ్వనుంది.
>> ALL THE BEST TEAM AP

News January 4, 2026

జమ్మలమడుగుకు చేరుకుంటున్న వాలీబాల్ క్రీడాకారులు

image

రేపు జరగబోయే 69వ జాతీయస్థాయి అండర్-14 వాలీబాల్ క్రీడలకు 27 టీమ్స్‌ ఈరోజు జమ్మలమడుగుకు చేరుకున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. మిగతా టీంలు రేపు ఉదయానికి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటాయని తెలిపారు. ఈ క్రీడాకారులకు అందరికీ పూర్తిగా వసతి, భోజన ఏర్పాట్లు చేశామన్నారు. రేపు జరగబోయే పోటీలకు జమ్మలమడుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News January 4, 2026

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఖరారు

image

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్.డి. విజయ జ్యోతిని రెండవసారి నియమించారు. ఈ నియామకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. జిల్లా స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తనపై మరోసారి నమ్మకం ఉంచిన అధిష్ఠానానికి విజయ జ్యోతి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని ఆమె తెలిపారు.