News November 1, 2024
గండిపేటకు గోదావరి జలాలు

గండిపేట చెరువుకు గోదావరి నీళ్లు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల్లో టెండర్లను పిలవనుంది. తొలి దశలో గండిపేట నుంచి బాపూఘాట్ వరకు పనులు కానుండగా.. బాపూఘాట్ని సుందరీకరించనుంది. మూసీ పునరుజ్జీవంలో బాపూఘాట్లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. బాపూఘాట్ దగ్గర వీటి శుద్ధి ఎస్టీపీలకు రూ.7 వేల కోట్లతో టెండర్లు 3 పిలవనుంది. ఈ మేరకు అధికారులతో సీఎం సమీక్షించారు.
Similar News
News November 21, 2025
HYD: చేవెళ్ల హైవేపై మరో ఘోర ప్రమాదం

చేవెళ్ల ట్రాఫిక్ PS పరిధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. మొయినాబాద్లోని తాజ్ సర్కిల్ సమీపంలో కనకమామిడి వెళ్లే రూట్లో 2 కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 21, 2025
రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్కు నోటీసులు

GHMC ఖజానాకు గండికొడుతున్న సినిమా స్టూడియోలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియో విస్తీర్ణానికి ₹11.52 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా యాజమాన్యం ₹49 వేలు చెల్లింస్తోందని గుర్తించారు. జూబ్లీహిల్స్లోని రామనాయుడు స్టూడియో విస్తీర్ణం తక్కువ చూపుతూ ₹1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా ₹1,900 చెల్లిస్తుండడంతో GHMC సర్కిల్ 18 అధికారులు నోటీసులు జారీ చేశారు.
News November 21, 2025
హైదరాబాద్లో గజ.. గజ.. గజ..

HYDలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. 10ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా చలి రికార్డు సృష్టిస్తోంది. నిన్న పటాన్చెరులో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6.4 తక్కువగా నమోదయ్యాయి. రాజేంద్రనగర్లో 11.5, హయత్నగర్లో 12.6, అటు కూకట్పల్లి, ఇటు పాతబస్తీ పరిసరాల్లో 13°Cకు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. సగటున గరిష్ఠ ఉష్ణోగ్రత 29.4, కనిష్ఠ ఉష్ణోగ్రత 13.1 డిగ్రీలుగా నమోదైంది. పలుచోట్ల ఉ.8వరకు మంచు కురుస్తోంది.


