News March 15, 2025

గంపలగూడెం: కనుమరుగవుతున్న మామిడి తోటలు

image

ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడు డివిజన్లో మామిడి పండ్లు అంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంత ప్రాధాన్యతుందో మనకి తెలిసిన విషయమే. ఆ డివిజన్లో గంపలగూడెం కూడా ఒక భాగమే. అయితే గంపలగూడెం మండల పరిధిలోని ఇప్పటి వరకు సుమారు 200 ఎకరాల మామిడి తోటలు నరికివేతకు గురయ్యాయి. దీనికి కారణం కోతులు బెడద, పంట చేతికొచ్చే సమయానికి వాతావరణంలో మార్పులు, ఇలా పలు కారణాలు వల్ల మామిడి తోటలు కనుమరుగవుతున్నాయని రైతులు వాపోయారు.

Similar News

News April 15, 2026

మూడు జిల్లాల్లో 4 వేలకు పైగా స్లాట్ బుకింగ్స్

image

మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గత నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ల కోసం 4 వేలకుపైగా స్లాట్ బుకింగ్స్ నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరగడం, ఆస్తుల కొనుగోలు విక్రయాలు అధికమవడం దీనికి కారణంగా అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానం వల్ల పారదర్శకత పెరిగి, ప్రజలకు సులభంగా సేవలు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరుగుదల ఉండొచ్చని అంచనా వేశారు.

News April 15, 2026

శ్రీకాకుళం: కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో 87.82 శాతం ఉత్తీర్ణత

image

శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం 772 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 678 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సమగ్ర శిక్ష జిల్లా ఏపీసీ పి.వేణుగోపాలరావు బుధవారం తెలిపారు. 87.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. అత్యధికంగా 978 మార్కులు వచ్చాయని అన్నారు. నాలుగు కేజీబీవీలు శత శాతం ఫలితాలు సాధించాయని చెప్పారు.

News April 15, 2026

గుంటూరుకు గర్వకారణం..10thలో 596, ఇంటర్‌లో 469

image

గుంటూరుకు గర్వకారణం బల్లా గగన శ్రీ మరోసారి మార్కులతో మంత్ర ముగ్ధులను చేసింది. గతంలో పదో తరగతిలో 600లో 596 మార్కులు సాధించి ప్రతిభ చాటుకున్న ఆమె, ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరం MPCలో 470కి 469 మార్కులు సాధించి తన ప్రతిభను మళ్లీ నిరూపించింది. విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న గగన శ్రీ క్రమశిక్షణ, కఠిన శ్రమతో ఉన్నత శిఖరాలపై దూసుకెళ్తోంది.