News January 29, 2025
గంభీరావుపేట: కారును ఢీకొన్న బైక్.. దంపతులకు గాయాలు

గంభీరావుపేట మండలం పెద్దమ్మ అటవీ ప్రాంతంలో బైక్ కారును ఢీకొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాలోతు రమేశ్, రేణా అనే దంపతులు ఎక్స్ఎల్ వాహనంపై మాచారెడ్డికి వెళ్తూ ఎదురుగా వస్తున్న లింగాపూర్ గ్రామానికి చెందిన మధు కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలు కాగా స్థానికులు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 18, 2025
సైబర్ సేఫ్టీలో తెలంగాణను నంబర్ వన్గా ఉంచుతాం: రేవంత్

TG: దేశంలోనే సైబర్ సేఫ్టీలో రాష్ట్రాన్ని నంబర్ వన్గా నిలపడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. సైబర్ నేరాలకు పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా జరుగుతున్న షీల్డ్-2025 సదస్సులో ఆయన మాట్లాడారు. ‘దేశంలో సైబర్ నేరగాళ్లు గత ఏడాది రూ.22,812 కోట్లు దోచుకున్నారు. ఇది మన ఆర్థిక వ్యవస్థ, పౌరులకు పెద్ద ముప్పు. సైబర్ నేరాల నుంచి రక్షించే 1930 సైబర్ హెల్ప్ లైన్ నంబర్ను ప్రతి ఒక్కరూ షేర్ చేయాలి’ అని CM కోరారు.
News February 18, 2025
MNCL: 30వ రోజుకు చేరుకున్న రిలే నిరాహారదీక్షలు

మంచిర్యాలలోని శాలివాహన పవర్ ప్లాంట్ ఎదుట కార్మికులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు నేటితో 30వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్ మాట్లాడుతూ.. ప్లాంట్ మూసివేసి 26 నెలలు గడుస్తున్న కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ చెల్లించకుండా కంపెనీ యాజమాని, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
News February 18, 2025
అల్లు అర్జున్ సినిమాలో జాన్వీ కపూర్?

ఐకాన్స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ చిత్రం దాదాపు ఖరారైనట్లేనని సమాచారం. ఈ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ను తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే తన నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్తోనే అని బన్నీఒక ప్రైవేట్ షోలో చెప్పిన సంగతి తెలిసిందే. కానీ షెడ్యూల్ తదితర కారణాల రీత్యా పుష్ప-2 తర్వాత తన తదుపరి చిత్రం అట్లీతో చేయనున్నారట. ఈ మూవీపై పూర్తి అప్డేట్స్ త్వరలో వచ్చే అవకాశాలున్నాయి.