News April 8, 2024

గంభీరావుపేట: తల్లిదండ్రుల ముందు విద్యార్థినిని కొట్టిన ప్రిన్సిపల్

image

విద్యార్థినిని ప్రిన్సిపల్ కొట్టిన ఘటన గంభీరావుపేట మండలంలోని గురుకుల పాఠశాలలో జరిగింది. గ్రామానికి చెందిన ఎడ్ల యశస్విని పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. కూతురుని చూద్దామని ఆదివారం తల్లిదండ్రులు పాఠశాలలోకి వెళ్లారు. ఈక్రమంలో భోజనం సరిగా లేదని యశస్విని చెప్పడంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ తల్లిదండ్రుల ముందు బిడ్డను కొట్టినట్లు ఆరోపించారు.

Similar News

News October 9, 2024

కరీంనగర్: తమ్ముడిని హత్య చేసిన అన్న

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుందేళ్ల కుమారస్వామి, కుందేళ్ల చంద్రు ఇద్దరు అన్నదమ్ములు. తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో నిన్న రాత్రి వీరిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో అన్న కుమారస్వామి తమ్ముడైన చంద్రుని ఇనుపరాడ్‌తో తలపై కొట్టాడు. అనంతరం కుమారస్వామి స్టేషన్‌లో లొంగిపోయాడు.

News October 9, 2024

తంగళ్లపల్లి: మూడు ప్రభుత్వ కొలువులు సాధించిన యువకుడు

image

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకి చెందిన దాసరి ప్రశాంత్ 2020లో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా జాబ్ సాధించాడు. విధులు నిర్వహిస్తూనే రైల్వే గ్రూప్ డీ, ఎస్జీటీ టీచర్, TGPSC గ్రూప్4 మూడు ఉద్యోగాలు ఒకేసారి సాధించాడు. సొంత నోట్స్, రోజు ప్రిపరేషన్ వల్ల తను సక్సెస్ కాగలిగానని ప్రశాంత్ తెలిపాడు. ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించిన ప్రశాంత్‌ను పలువురు గ్రామస్థులు అభినందించారు.

News October 9, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,44,849 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,00,714, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.27,915, అన్నదానం రూ.16,220,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.