News April 3, 2025
గంభీరావుపేట: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

గంభీరావుపేట మండలం ముస్తఫానగర్లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బుధవారం బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శివంది దేవయ్య(47) తన వ్యవసాయ పొలం వద్ద బావిని పూడిక తీసేందుకు పనులు చేపట్టాడు. పనులు ఎక్కడ వరకు వచ్చాయి అనే క్రమంలో తొంగి చూసే ప్రయత్నం చేయగా అందులో కాలు జారిపడి బావిలో పడడంతోతీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు దేవయ్యను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందతూ రాత్రి మృతిచెందాడు.
Similar News
News December 4, 2025
కృష్ణా తరంగ్-2025ను ప్రారంభించిన వెంకయ్య నాయుడు

కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృష్ణా తరంగ్-2025 (యూత్ ఫెస్టివల్)ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం లాంఛనంగా ప్రారంభించారు. తొలుత జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమం మెుదలుపెట్టారు. అనంతరం ఎన్.సీ.సీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ, ఉపకులపతి ఆచార్య రాంజీ, తదితరులు పాల్గొన్నారు.
News December 4, 2025
వస్తువు కొనేముందు ఓ సారి ఆలోచించండి: హర్ష

అవసరమైన వస్తువులను మాత్రమే కలిగి ఉండే జీవనశైలిని అలవరుచుకోవాలని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా యువతకు సూచించారు. ‘మెరుగైన లైఫ్స్టైల్ కోసం ప్రయత్నిస్తూ చాలా మంది తమ మనశ్శాంతిని కోల్పోతున్నారు. విలాసంగా జీవించడం అంటే ఎక్కువ వస్తువులను కొనడం కాదు. తక్కువ వస్తువులు ఉంటే వాటి నిర్వహణ, శ్రమ కూడా తగ్గుతుంది’ అని అభిప్రాయపడ్డారు. అందుకే వస్తువులను కొనేముందు అవి నిజంగా అవసరమా అని ఆలోచించండి. SHARE IT
News December 4, 2025
పొన్నూరు ఆంజనేయస్వామిని దర్శించుకున్న బాపట్ల కలెక్టర్

పొన్నూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని బాపట్ల కలెక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ సందర్శించారు. గురువారం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎంతో ప్రాచుర్యం పొందిన ఆలయాన్ని దర్శించడం ఆనందంగా ఉందన్నారు.


