News April 3, 2025

గంభీరావుపేట: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

image

గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బుధవారం బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శివంది దేవయ్య(47) తన వ్యవసాయ పొలం వద్ద బావిని పూడిక తీసేందుకు పనులు చేపట్టాడు. పనులు ఎక్కడ వరకు వచ్చాయి అనే క్రమంలో తొంగి చూసే ప్రయత్నం చేయగా అందులో కాలు జారిపడి బావిలో పడడంతోతీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు దేవయ్యను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందతూ రాత్రి మృతిచెందాడు.

Similar News

News February 23, 2026

నేటి నుంచే ఇంటర్ పరీక్షలు

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 1,537 కేంద్రాల్లో 10,57,899 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉ.9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా విద్యార్థులు అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని బోర్డు తెలిపింది. నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు. సమాధానాలు రాసేందుకు బుక్‌లెట్ మాత్రమే ఇస్తారు. ఈసారి అడిషనల్ ఆన్సర్ షీట్లు ఇవ్వరు.

News February 23, 2026

పరీక్షల తర్వాతే ఎన్నికలు?

image

TG: MPTC, ZPTC ఎన్నికలు ఇంటర్, టెన్త్ పరీక్షల తర్వాతే నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ DCCలకు ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమం కొనసాగుతోంది. తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అనంతరం ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికార యంత్రాంగమంతా ఆయా పనుల్లోనే బిజీగా ఉండనుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పరీక్షల తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

News February 23, 2026

ముర్రా జాతి గేదెల ప్రత్యేకతలు ఇవే

image

ముర్రా జాతి గేదెలు హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు చెందినవి. వీటి శరీరం ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా V(వీ) ఆకారంలో ఉంటుంది. దీని వల్ల ఇవి తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ పాలను ఇస్తాయి. ఒక ముర్రా గేదె రోజుకు 14 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తుంది. మేలైన జాతి గేదెలు రోజుకు 25-30 లీటర్ల వరకు పాలు ఇచ్చే ఛాన్సుంది. ఒక ఈత కాలంలో ఇవి సుమారు 270-300 రోజులు పాలు ఇస్తాయి. పాలలో వెన్న 7 నుంచి 9 శాతంగా ఉంటుంది.