News February 14, 2025

గచ్చిబౌలిలో ఏసీబీకి పట్టుబడ్డ ఏడీఈ

image

గచ్చిబౌలిలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ACB అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ గచ్చిబౌలి ఏడీఈ సతీశ్ కుమార్ పట్టుబడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ మంజూరుకు రూ.75వేలు డిమాండ్ చేశారు. వినియోగదారుల నుంచి ఇప్పటికే రూ.25 వేలు తీసుకున్నారు. కాగా, ఈరోజు మరో రూ.50 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ACB అధికారులు పట్టుకున్నారు.

Similar News

News March 13, 2025

రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత

image

రంగారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతోంది. బుధవారం మోయినాబాద్లో 39.7℃, మొగల్గిద్ద, కేతిరెడ్డిపల్లె, మంగళపల్లె 39.5, ప్రొద్దుటూరు 39.3, రెడ్డిపల్లె 39.2, షాబాద్, కాసులాబాద్ 39.1, చుక్కాపూర్ 39, మహేశ్వరం, నాగోల్ 38.6, హస్తినాపురం 38.5, మామిడిపల్లె, తుర్కయంజాల్, తొమ్మిదిరేకుల 38.5, కోతూర్, హఫీజ్‌పేట్ 38.4, చంపాపేట్ 38.3, శంకర్‌పల్లి 38.3, ఖాజాగూడ, మహంకాళ్, అలకాపురి 38.2℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 13, 2025

HYD: BRAOU సెమిస్టర్-1 హాల్ టికెట్లు విడుదల

image

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లు విద్యార్థులు www.braouonline.in అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఫోన్లకు మేసేజ్‌లు పంపినట్లు తెలిపారు.

News March 13, 2025

HYD: హోలీ నేపథ్యంలో నగరంలో ఆంక్షలు: సీపీ

image

హోలీ నేపథ్యంలో HYDలో ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ఉదయం 6 గం. నుంచి శనివారం ఉదయం 6 గం. వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. వైన్సులతో సహా.. గ్రేటర్ పరిధిలో ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలపై ఆంక్షలుంటాయని ఆదేశించారు. రోడ్లపై వెళ్లే వారిపై అకారణంగా రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు.

error: Content is protected !!