News February 5, 2025

గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్

image

గచ్చిబౌలి సిద్దిక్‌నగర్‌లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 28, 2025

ట్రాఫిక్ చలాన్లపై నివేదిక ఇవ్వాలని హోంశాఖకు హైకోర్టు నోటీసులు

image

ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసిన విధానంపై హైకోర్టు సీరియస్ అయింది. మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసి చలాన్ వేస్తున్నారని నగరవాసి రాఘవేంద్ర చారి పిటిషన్ దాఖలు చేశారు. తనకి 3 చలాన్లు వేశారని, ట్రాఫిక్ పోలీసులు సొంత మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ చలాన్ ఎన్ఫోర్స్‌మెంట్ విధానంపై పూర్తి నివేదిక ఇవ్వాలని, 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హోం శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

News November 28, 2025

కోకాపేట భూములు అ‘ధర’గొట్టాయి!

image

​HYDలోని కోకాపేటలో నవంబర్ 28న జరిగిన భూముల ఈ-వేలంలో భారీ మొత్తంలో ధరలు నమోదయ్యాయి. నియోపోలిస్, గోల్డెన్ మైల్ ఏరియాల్లోని 15, 16 నంబర్ ప్లాట్లకు ఈ వేలం జరిగింది. ​ఈ వేలంలో ఒక్కో ఎకరం ₹140 కోట్లు చొప్పున పలికింది. ఈ 2 ప్లాట్లకు కలిపి మొత్తం ₹1268 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట భూములకు వచ్చిన ఈ ధరలు రికార్డు సృష్టించాయి.

News November 28, 2025

HYD: సిబ్బంది లేమి.. నియామకాలేవి: పద్మనాభరెడ్డి

image

రాష్ట్రంలోని 25 కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది లేమి తీవ్రంగా ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఎంకి లేఖ రాసింది. 1,413 మంది కావాల్సిన చోట 111 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 22 ఆస్పత్రుల్లో ఒక్క నియామకం జరగలేదని లేఖలో పేర్కొన్నారు. సిబ్బంది లేక దవాఖానాలు మూతబడి, వాటిలో కొన్ని చోట్ల అసాంఘిక చర్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 1,302 పోస్టులను భర్తీ చేసి ఆస్పత్రులు ప్రారంభించాలన్నారు.