News February 5, 2025
గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్

గచ్చిబౌలి సిద్దిక్నగర్లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 24, 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో హై అలర్ట్..!

సీపీఐ పార్టీ ఆపరేషన్ కగార్ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పోలీసులు అప్రమత్తమై ప్రధాన రహదారులు, మార్కెట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రజాసంఘాలు, యువత, విద్యార్థులు, మహిళా సంఘాలు బంద్ విజయవంతం చేయడానికి సహకరించాలని మావోయిస్టు పార్టీ ప్రతినిధి అభయ్ ప్రకటన విడుదల చేయడంతో అధికారులు, అధిక జాగ్రత్తలు తీసుకున్నారు. WGL కమిషనరేట్ అప్రమత్తమైంది.
News October 24, 2025
రావులపాలెం: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన అడపాల కోటమ్మ (61) మృతి చెందింది. స్వగ్రామం వెళ్లేందుకు బస్టాండ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News October 24, 2025
విజయవాడ బస్టాండ్లో నిలువు దోపిడీ..!

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లోని స్టాల్స్ నిర్వాహకులు ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ సహా ప్రతి వస్తువుపై MRP కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారు. గతంలో ఫిర్యాదులు అందినప్పటికీ, RTC అధికారులు లైట్ తీసుకుంటున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా బస్టాండ్ల్లో ఇదే పరిస్థితి ఉందని వాపోతున్నారు.


