News February 5, 2025
గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్

గచ్చిబౌలి సిద్దిక్నగర్లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News January 7, 2026
చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీల షెడ్యూల్ ఇదే

ఈ నెలలో జరగనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ 2025-26, క్రీడా పోటీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 17వ తేదీ నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి. క్రీడాకారుల ప్రతిభను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు జరగనున్నాయి.
News January 7, 2026
ఒప్పో సబ్ బ్రాండ్లుగా రియల్మీ, వన్ ప్లస్.. కారణమిదే!

చైనా మొబైల్ కంపెనీలు రియల్మీ, వన్ ప్లస్ ఇకపై ఒప్పో సబ్ బ్రాండ్లుగా మారనున్నాయి. ఒప్పో సారథ్యంలోనే ఇవి పని చేయనున్నాయి. నిజానికి ఒప్పో, వివో, వన్ ప్లస్, రియల్మీ కంపెనీలు BBK ఎలక్ట్రానిక్స్కు చెందినవి. తాజా నిర్ణయంతో వేర్వేరుగా రీసెర్చ్&డెవలప్మెంట్, సేల్స్, లాజిస్టిక్ టీమ్స్ అవసరం ఉండదు. వనరులను సమీకరించుకుని, ఖర్చులను తగ్గించుకుని మార్కెట్లో మరింత వృద్ధి చెందాలని ఇవి లక్ష్యంగా పెట్టుకున్నాయి.
News January 7, 2026
మేడారంలో కనిపించిన పారిశుధ్యం

మేడారం జాతరలో పారిశుద్ధ్య పనులలో లోపం స్పష్టంగా కనిపిస్తుంది. గద్దెలకు సమీపంలోని ప్రదేశాలు ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, ఆహార అవశేషాలు, జంతు వ్యర్థాలతో దర్శనమిస్తున్నాయి. పారిశుధ్య కార్మికుల జాడ కనిపించడం లేదు. ముందస్తు మొక్కులు సమర్పించడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో పారిశుధ్యంపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.


