News February 5, 2025
గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్

గచ్చిబౌలి సిద్దిక్నగర్లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 28, 2025
NZB: GPఎన్నికలు.. సిబ్బందికి సీపీ సూచనలు

గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు పోలీసు సిబ్బందికి నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఎన్నికల భద్రత, శాంతి భద్రతా చర్యలు, పర్యవేక్షణకు సంబంధించిన సలహాలు ఇచ్చారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడడం ప్రజల భద్రత అని శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ బాధ్యత అని పేర్కొన్నారు.
News November 28, 2025
సూర్యాపేట జిల్లా గ్రామ ఓటర్ల లెక్క

సూర్యాపేట జిల్లాలో గ్రామ ఓటర్ల లెక్క తేలింది. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా గ్రామ ఓటర్లు ఉన్నట్లు 6,94,815 ఎన్నికల సంఘం ప్రకటించింది. గరిడేపల్లి మండలంలో అత్యధికంగా 46,796 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా తిరుమలగిరి మండలంలో 17,799 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు 22 మంది ఉన్నారు. మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఈ తుది జాబితాలోనే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
News November 28, 2025
జనగామ: ఏకగ్రీవం వైపు సీనియర్.. పోటీ వైపు జూనియర్!

జనగామ జిల్లాలోని ఆయా గ్రామాల్లో పలు పార్టీల నేతలు ఏకగ్రీవం వైపు మొగ్గు చూపుతున్నారు. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా.. ఏకగ్రీవం చేస్తే గ్రామానికి పనులు చేస్తామంటూ స్వంతంగా మేనిఫెస్టో తయారు చేసి పలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా ఏకగ్రీవానికి చోటు ఇవ్వం అన్నట్లుగా యువ రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నారు. ఏదేమైనా గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్లు కావాలని ప్రజలు అంటున్నారు.


