News November 7, 2024
గచ్చిబౌలి: క్రీడా శిక్షణ శిబిరంగా మారునున్న TIMS

రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో TIMS ప్రాంగణాన్ని క్రీడాకారుల గురుకుల శిక్షణ శిబిరం, స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సుగా మార్చనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. 2002లో ప్రారంభమైన GMC బాలయోగి స్టేడియం,మళ్లీ క్రీడల కోసం నూతన పుంతలు తొక్కనుంది.
Similar News
News February 23, 2026
మురికి కూపంలో జవహర్నగర్.. డంపింగ్ యార్డు వేట!

గ్రేటర్లో మున్సిపాలిటీల విలీనం చివరకు జవహర్నగర్ పాలిట శాపంగా మారింది. సిటీ నుంచి రోజూ దాదాపు 8000 మెట్రిక్ టన్నుల చెత్త అక్కడ చేరుతుండగా.. కొత్త ప్రాంతాల నుంచి వస్తున్న 1500 టన్నుల అదనపు భారం ఆ ఊరిని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ఈ నరకం నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం వికేంద్రీకరణ బాట పట్టింది. శివారు ప్రాంతాల్లో కొత్త డంపింగ్ యార్డుల కోసం వేట మొదలుపెట్టింది.
News February 23, 2026
HYD: పోలీసులకు దొరికితే హెల్మెట్ ఫ్రీ.. Conditions Apply!

హెల్మెట్ లేకుండా పట్టుబడితే FINEతో పాటు పోలీసులు FREEగా హెల్మెట్ ఇస్తున్నారు. మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగం ‘హెల్మెట్ బ్యాంక్’ పేరుతో సంగీత్ చౌరస్తాలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. బైకర్ వివరాలు నమోదు చేసి హెల్మెట్ తీసుకోవచ్చు. 24 గంటల్లోపు సొంతంగా హెల్మెట్ కొనుక్కుని పోలీసుల వద్ద తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి. చలాన్ల కన్నా ప్రాణ రక్షణే ముఖ్యం అని పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
News February 23, 2026
బంజారాహిల్స్లో ర్యాపిడో బైక్ను ఢీ కొట్టిన ట్యాంకర్.. ఇద్దరి మృతి

బంజారాహిల్స్లో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న వాటర్ ట్యాంకర్ ర్యాపిడో బైక్ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న రైడర్ (హోంగార్డ్), అతని వెనక కూర్చున్న యువతి అక్కడికక్కడే మృతి చెందారు. యువతిని పిక్ చేసుకున్న కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.


