News April 6, 2024

గజపతినగరంలో అతనొక్కడే ఏకగ్రీవం

image

గజపతినగరం నియోజకవర్గంలో ఏకగ్రీవంగా గెలిచిన ఒకే ఒక్కరు పెనుమత్స సాంబశివరాజు. ఈయన గజపతినగరం నుంచి 1967లో ఇండిపెండెంట్‌గా గెలిచి తొలిసారి అసెంబ్లీకి వెళ్లారు. 1972లో ఆయనకి ప్రత్యర్థి లేకపోవడంతో విజయం ఏకగ్రీవం అయ్యింది. 1978 నుంచి 2004 వరకు అప్పటి సతివాడ నియోజకవర్గం నుంచి 7సార్లు పోటీ చేయగా.. 1994 మినహా మిగిలిన 6 సార్లు విజయం సాధించారు. ఈయన వారసుడు సురేశ్ ఇప్పడు వైసీపీ నుంచి MLCగా కొనసాగుతున్నారు.

Similar News

News November 18, 2025

అల్లూరిలో ఎన్‌కౌంటర్.. భద్రత చర్యలు కట్టుదిట్టం: VZM ఎస్పీ

image

అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో, విజయనగరం జిల్లా వ్యాప్తంగా భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని ముఖ్య కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. పాత నేరస్తుల కదలికలపై కూడా నిఘా పెట్టినట్లు వెల్లడించారు.

News November 18, 2025

10వ తరగతి ఫలితాల్లో జిల్లా ముందజలో ఉండాలి: కలెక్టర్

image

పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ముందంజలో నిలవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. తక్కువ ప్రగతి చూపుతున్న విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు మించి ర్యాంకులు సాధించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

News November 18, 2025

VZM: ‘రైతుల ఖాతాల్లో రూ.150 కోట్లు జమ’

image

సుఖీభవ-పీఎం కిసాన్ పథకం రెండో విడత నిధులను బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు జమ చేయనున్నారని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలో 2,27,700 మంది రైతుల ఖాతాల్లో రూ.150.03 కోట్లు జమ కానున్నాయి. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ.7,000 (సుఖీభవ రూ.5వేలు, పీఎం కిసాన్ రూ.2వేలు ) చొప్పున జమ అవుతుందని తెలిపారు.