News February 13, 2026

గజపతినగరం: హాస్టల్ రూములో విద్యార్థి ఆత్మహత్య..!

image

గజపతినగరంలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి గురువారం రాత్రి మృతి చెందాడు. మెరకముడిదాం (M) ఊటపల్లి గ్రామానికి చెందిన రాజేశ్ నిన్న సాయంత్రం స్టడీ అవర్స్ అయిన వెంటనే తన గదిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి అపస్మారక స్థితిలో ఉన్న రాజేశ్‌ను సిబ్బంది ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే విద్యార్థి మెడపై ఉరివేసుకున్నట్లు ఉన్న ఆనవాలను పోలీసులు గుర్తించారు.

Similar News

News March 13, 2026

వరంగల్: టెన్త్ పరీక్షలకు గ్యాస్ కష్టాలు!

image

వారం రోజుల్లో ముగించాల్సిన పది పరీక్షలను నెల పాటు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 14 నుంచి వచ్చే నెల 13 వరకు పరీక్షలను నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఒక్కో పరీక్షకు 5 రోజుల పాటు విరామం ఇచ్చారు. ఇరాన్ యుద్దంతో ఇప్పటికే గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. మరో నెల పాటు పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,17,727 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో సగం మంది హస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు.

News March 13, 2026

యుద్ధం.. నెల్లూరు జిల్లాలో భారీగా తగ్గిన ధరలు

image

ఏటా వేసవిలో గూడూరు నిమ్మ మార్కెట్‌‌లో ధరలు పెరుగుతుంటాయి. ఇప్పుడు ఎండలు మండిపోతున్నా ధరలు పడిపోతున్నాయి. కారణం యుద్ధం. విదేశాలకు ఎగుమతులు ఆగిపోయాయి. చిన్న హోటల్స్ నుంచి 5స్టార్ హోటల్స్‌ వరకు నిమ్మకాయలు కొంటారు. గ్యాస్ కొరతతో హోటళ్లు మూత పడటంతో ధరలు భారీగా తగ్గిపోయాయి. 2రోజుల కిందట KG నిమ్మకాయలు రూ.110 ఉండగా నేడు కేజీ రూ.80-రూ.85 మాత్రమే ఉంది. మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

News March 13, 2026

ఆల్మట్టి ఎత్తు పెంపు.. కృష్ణా బేసిన్‌లో కలవరం

image

ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 నుంచి 524.25 మీటర్లకు పెంచే దిశగా కర్ణాటక ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కృష్ణా ఎగువ ప్రాజెక్టు మూడో విడతలో భాగంగా ఎత్తు పెంచి 130 నుంచి 250పైగా TMCల అదనపు నీటిని నిల్వ చేయాలని భావిస్తోంది. దీనికి TG, AP దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే జరిగితే పాలమూరు నీటి లభ్యత భారీగా తగ్గిపోనుంది. భూ సేకరణ, పునరావాసానికి కర్ణాటక ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించింది.