News February 7, 2025
గజ్వేల్లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల విలీనం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738908298725_51703636-normal-WIFI.webp)
మల్లన్న సాగర్ ముంపుకు గురైన 7 గ్రామాలను గజ్వేల్ మున్సిపాలిటీలో విలీనమైనట్లే అని డీపీవో జానకీదేవి తెలిపారు. తొగుట మండలంలోని 5, కొండపాక మండలంలోని 2 గ్రామాలు ముంపునకు గురి కాగా గజ్వేల్ పరిధిలో ఆర్అండ్ ఆర్ కాలనీని నిర్మించి 4ఏళ్ల క్రితం నిర్వాసితులను తరలించారు. ఈ 7గ్రామాల పరిధిలో 15 వేల జనాభా ఉండగా, ఏడు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. తాజాగా గజ్వేల్ గ్రేడ్ మారడంతోపాటు వార్డుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది.
Similar News
News February 7, 2025
ఐదేళ్ల క్రితం రూ.8.7 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.2.4 కోట్లు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738911336788_746-normal-WIFI.webp)
స్టాక్ మార్కెట్లో విజయం సాధించడం అందరికీ సాధ్యం కాదు. కానీ సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తే ఇలా ఉంటుంది. ఐదేళ్ల క్రితం 10వేల డాలర్లు(రూ.8.7లక్షలు) సేవింగ్స్ అకౌంట్లో భద్రపరిస్తే అది రూ.8.96 లక్షలు అయ్యేది. అదే డబ్బును స్టాక్ మార్కెట్లో Nvidiaలో ఇన్వెస్ట్ చేస్తే $285,000 (రూ.2.4కోట్లు), Bitcoinలో చేస్తే $220,000, Teslaలో చేస్తే $139,000 అయ్యేవి.
నోట్: ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహాలు పాటించాలి.
News February 7, 2025
ADB: రేపు పాఠశాలలకు సెలవు లేదు: DEO ప్రణీత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738942200377_60250757-normal-WIFI.webp)
రేపు రెండవ శనివారం అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు లేదని జిల్లా విద్యాధికారి ప్రణీత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సెలవును ప్రకటిస్తూ ఫిబ్రవరి 8 రెండవ శనివారం పని దినంగా ఉంటుందని సర్కులర్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలను యదావిధిగా నడపాలని ప్రధానోపాధ్యాయులకు ఆమె సూచించారు.
News February 7, 2025
WGL: ముగిసిన మొదటి విడుత ఇంటర్ ప్రయోగ పరీక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738943213564_52409575-normal-WIFI.webp)
వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడుత ఇంటర్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీధర్ సుమన్ తెలిపారు. ఫిబ్రవరి 3 నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు ఐదు రోజులు నిర్వహించారన్నారు. ప్రతి రోజు ఉ.9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు వేళల్లో పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.