News February 18, 2025
గజ్వేల్: అటవీ భూముల నుంచి త్రిబుల్ ఆర్: కలెక్టర్

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు జిల్లాలోని గజ్వేల్, మైలారం గ్రామంలో గల 28 హెక్టార్ల అటవీ భూమిలో నుంచి వెళ్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి తెలిపారు. జిల్లా స్థాయి స్వచ్చంధ సంస్థల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఫారెస్ట్ రైడ్ యాక్ట్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. అలాగే జిల్లాలో గల అటవీ భూమి ఉన్న ప్రాంతాన్ని మొత్తం సంరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
Similar News
News November 23, 2025
నాకు పేరు పెట్టింది ఆయనే: సాయిపల్లవి

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ సాయిపల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. తన అమ్మ, తాతయ్య సాయిబాబాకు భక్తులని తెలిపారు. పుట్టపర్తి సాయి తనను దీవించి పేరు పెట్టినట్లు వెల్లడించారు. తాను కూడా సాయిబాబా భక్తురాలినేనని, ఆయన బోధనలు తనలో ధైర్యం నింపాయని చెప్పారు. ప్రశాంతత, క్రమశిక్షణ, ధ్యానం వంటివి ఆయన నుంచి నేర్చుకున్నట్లు పేర్కొన్నారు.
News November 23, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ముందుగా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
News November 23, 2025
HYD: జంట జలాశయాల ప్రత్యేకత ఇదే!

ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాలు నగరవాసుల దాహార్తిని తీరుస్తున్నాయి. మూసీ నది 1908లో భాగ్యనగరాన్ని వరదలతో ముంచెత్తగా.. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ వరదలకు అడ్డుకట్ట వేసేందుకు 1920-1926లో మూసీ, ఈసీ నదులపై మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికతో వంతెనలు నిర్మించారు. అప్పటి నుంచి నగరానికి తాగునీటి సరఫరా చేయడం ప్రారంభించారు.


