News March 23, 2025
గజ్వేల్: అహ్మదీపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామ శివారులోని పెద్దమ్మ తల్లి దేవాలయం సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొగుట వైపు నుంచి గజ్వేల్ వైపు వస్తున్న లారీ బంజేరుపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడిక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు.
Similar News
News March 30, 2025
అక్టోబర్లో ఆసీస్ పర్యటనకు భారత్

ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. 3 వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. షెడ్యూల్ ఇలా..
OCT 19: మొదటి వన్డే(పెర్త్)
OCT 23: సెకండ్ వన్డే(అడిలైడ్)
OCT 25: మూడో వన్డే(సిడ్నీ)
OCT 29: ఫస్ట్ టీ20(మనుకా ఓవల్)
OCT 31: రెండో టీ20(MCG)
NOV 2: థర్డ్ టీ20(బెల్లిరివ్ ఓవల్)
NOV 6: నాలుగో టీ20(గోల్డ్ కోస్ట్)
NOV 8: ఫిఫ్త్ టీ20(గబ్బా)
News March 30, 2025
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన BHPL కలెక్టర్

ముస్లిం ప్రజలకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పవిత్రమైన నెలగా, త్యాగం, భక్తి, సహనం, మానవతా విలువల ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఉపవాస దీక్ష, ప్రార్థనలు, దానం వంటి ఆచారాలు సామాజిక సమగ్రతను పెంపొందిస్తాయని, అందరూ కలిసికట్టుగా సమాజంలో శాంతి, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
News March 30, 2025
దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ల కుట్ర: బండి

TG: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మతం పేరుతో దేశాన్ని విభజించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.