News February 16, 2025

గజ్వేల్: ఎదురెదురుగా రెండు కార్లు ఢీ.. ఒకరు మృతి

image

ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటన గజ్వేల్ మండలం బయ్యారం స్టేజ్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అక్కడే ఉన్న వారు 108కి సమాచారం ఇవ్వగా గజ్వేల్ 108 సిబ్బంది EMT వర్షిత, లక్ష్మణ్, రాజు, పైలట్స్ నరేశ్, ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 7, 2025

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్

image

భారీగా విమాన సర్వీసుల రద్దు, వాయిదాలతో ప్రయాణికుల ఖాతాల్లోకి ఇండిగో డబ్బులు రీఫండ్ చేస్తోంది. ఇప్పటివరకు రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్లు విమానయాన శాఖ తెలిపింది. మరోవైపు 95శాతం సర్వీసులను రీస్టోర్ చేసినట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. డిసెంబర్ 10-15 మధ్యలో సేవలు సాధారణ స్థితికి చేరుతాయని పేర్కొంది.

News December 7, 2025

బ్రహ్మసముద్రం: అన్నదమ్ముల మృతిపై అప్‌డేట్..!

image

బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురంలోని నీటి సంపులో పడి అన్నదమ్ములు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గానికి చెందిన అన్నదమ్ములు నరేంద్ర (32), చరణ్ (25)పాల వెంకటాపురంలోని మామిడి తోటలోని సంపు వద్దకు వెళ్లారు. చరణ్ కాలుజారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. తమ్ముడిని కాపాడేందుకు అన్న సంపులో దూకాడు. ఇద్దరికి ఈతరాకపోవడంతో ఊపిరాడిక మృతి చెందారు.

News December 7, 2025

రేపు ‘నన్నయ్య’కు మాజీ ఉపరాష్ట్రపతి

image

ఆదికవి నన్నయ వర్సిటీలో 8, 9 తేదీల్లో “భారతీయ భాషలలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం”పై జాతీయ కార్యశాల జరగనుంది. కేంద్ర విద్యాశాఖ, భారతీయ భాషా సమితి సహకారంతో నిర్వహించే ఈ సదస్సుకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శాస్త్రీయ పదజాలాన్ని ప్రాంతీయ భాషల్లోకి సులభతరం చేసే లక్ష్యంతో ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు.