News February 16, 2025

గజ్వేల్: ఎదురెదురుగా రెండు కార్లు ఢీ.. ఒకరు మృతి

image

ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటన గజ్వేల్ మండలం బయ్యారం స్టేజ్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అక్కడే ఉన్న వారు 108కి సమాచారం ఇవ్వగా గజ్వేల్ 108 సిబ్బంది EMT వర్షిత, లక్ష్మణ్, రాజు, పైలట్స్ నరేశ్, ప్రభాకర్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 19, 2025

భద్రకాళి ఆలయ హుండీ ఆదాయం రూ. 65.93 లక్షలు

image

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో బుధవారం హుండీలు విప్పి లెక్కింపు చేశారు. ఈ లెక్కింపులో మొత్తం రూ. 65,93,481 ఆదాయం వచ్చింది. వీటితో పాటు 2483 యూఎస్ఏ డాలర్లు, 55 ఆస్ట్రేలియా డాలర్లు సహా ఇతర విదేశీ కరెన్సీలు లభించాయి. హుండీలో వచ్చిన మిశ్రమ బంగారం, వెండిని తిరిగి హుండీలో వేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, అధికారులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.

News November 19, 2025

ఆసిఫాబాద్‌లో రేపు మినీ జాబ్ మేళా

image

ఈ నెల 20న పాత కలెక్టర్ కార్యాలయం జనకాపూర్‌లో ఉదయం 10.30 గంటలకు TASK TRAINING CENTRE ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 19, 2025

ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీతో సింగరేణి సంస్థ కీలక ఒప్పందం

image

సింగరేణి సంస్థ పునరుద్పాదక ఇంధన రంగంలో విద్యుత్ ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టబోతోంది. ఇందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుత్ అమ్మకంలో సహకారానికి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో సింగరేణి సీఎండీ బలరామ్, డైరెక్టర్లు, ఎన్జీఈఎల్ ఉన్నతాధికారులు మౌర్య, బిమల్ గోపాల చారి పాల్గొన్నారు.