News March 7, 2025
గజ్వేల్: గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో 2025 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకులుగా బోధన చేసేందుకు ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డా. నిఖత్ అంజుమ్ ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలలో ఎకనామిక్స్ సబ్జెక్టులో ఒక పోస్టు ఖాళీగా ఉందన్నారు. దరఖాస్తు చేసుకునే వారు పీజీలో 55% మార్కులు, ఎస్సీ, ఎస్టీలైతే 50% మార్కులు ఉండాలన్నారు. ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 9, 2025
టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పూర్తి షెడ్యూల్ను పైన ఫొటోలో చూడవచ్చు. అనుకున్నట్టే CBSE పరీక్షల తరహాలో ఎగ్జామ్స్ మధ్య గ్యాప్ ఇచ్చారు. ఒక్కో పరీక్షకు మధ్య 4-5 రోజుల సమయం ఉంది. విద్యార్థుల ప్రిపరేషన్కు ఇది ఉపయోగపడనుంది.
News December 9, 2025
అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందే: సుప్రీంకోర్టు

పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) <<18513734>>వ్యవహారంపై<<>> సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. SIR కొనసాగుతుందని స్పష్టం చేసింది. BLOలపై బెదిరింపులను తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం, బెదిరింపులను తమ దృష్టికి తేవాలని ECని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు SIR కొనసాగించాల్సిందేనని తేల్చిచెప్పింది.
News December 9, 2025
భీమవరం: Way2News ఎఫెక్ట్.. ఉపాధ్యాయుడి సస్పెండ్

భీమవరం (M) గొల్లవానితిప్ప ZP హైస్కూల్లో లెక్కల మాస్టర్గా పనిచేస్తున్న సుధీర్ బాబును<<18500702>> సస్పెండ్<<>> చేస్తూ DEO నారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాస్టర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఈనెల 5న ఆయనకు ఫిర్యాదు వచ్చిందన్నారు. త్రిసభ్య కమిటీ ద్వారా విచారణకు ఆదేశించామన్నారు. విచారణలో ఆరోపణలు నిజం కావడంతో సస్పెండ్ చేశామన్నారు. ఈ ఘటనపై సోమవారం Way2News కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.


