News March 24, 2025

గజ్వేల్: పాదయాత్రగా వెళ్లి.. సీఎంకి ఫిర్యాదు.!

image

గజ్వేల్‌ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి హాజరుకాని మాజీ సీఎం కేసీఆర్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు. సీఎం నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సీఎంకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సిద్దిపేట నుంచి పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు HYD చేరుకున్నారు.

Similar News

News November 27, 2025

కృష్ణా నదీ జలాలపై హక్కులను వదులుకోం: సీఎం

image

AP: కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర హక్కులను వదులుకునేది లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని జలవనరుల శాఖ అధికారుల సమీక్షలో దిశానిర్దేశం చేశారు. నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులకు వీలులేదని, చట్టపరంగా దక్కిన వాటాను కొనసాగించాల్సిందేనని చెప్పారు. ఏటా వేలాది <<16807228>>TMC<<>>ల జలాలు సముద్రంలో కలుస్తున్నందున వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా వ్యవహరించాలన్నారు.

News November 27, 2025

KTDM: పోలీస్ స్టేషన్‌లో ఒక్కటైన ‘మూగ’ జంట

image

ప్రేమకు మాటలు అక్కర్లేదని నిరూపిస్తూ బూర్గంపాడు పోలీస్ స్టేషన్ వేదికగా మూగ, చెవిటి వైకల్యంతో బాధపడుతున్న ఓ జంట ఒక్కటయ్యింది. పెళ్లి కోసం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, పోలీసులు ఇరు కుటుంబాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించారు. చివరకు పోలీసుల సమక్షంలోనే ఆ జంట దండలు మార్చుకుంది. అక్కడ పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసేవారిలా కాకుండా, మనసున్న మారాజులుగా వ్యవహరించారు.

News November 27, 2025

VKB: ఈ గ్రామంలో ఒకే ఇంటికే పల్లె పగ్గాలు!

image

బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్‌లో పంచాయతీ రిజర్వేషన్లు ఓ కుటుంబానికే వరంగా మారాయి. గ్రామంలో సర్పంచ్ (ఎస్టీ జనరల్)తో పాటు ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళ వార్డులు రిజర్వ్ కావడంతో గ్రామంలో ఉన్న ఒక్క ఎస్టీ కుటుంబం ఎరుకలి భీమప్ప కుటుంబం మొత్తం పోటీ రంగంలో నిలబోనుంది. గ్రామంలో 494 ఓటర్లు, 8 వార్డులు ఉండగా, ఎస్టీ వర్గానికి చెందిన భీమప్ప కుటుంబం ఒక్కటే ఉండటంతో మూడు స్థానాలకు అదే ఇంటి నుంచే అభ్యర్థులు రావడం ఖాయం.