News March 24, 2025
గజ్వేల్: పాదయాత్రగా వెళ్లి.. సీఎంకి ఫిర్యాదు.!

గజ్వేల్ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి హాజరుకాని మాజీ సీఎం కేసీఆర్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు. సీఎం నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సీఎంకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సిద్దిపేట నుంచి పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు HYD చేరుకున్నారు.
Similar News
News December 1, 2025
గ్లోబల్ సిటీగా మారనున్న హైదరాబాద్

గ్రేటర్ హైదరాబాద్ త్వరలోనే గ్లోబల్ సిటీగా మారనుంది. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేసిన నేపథ్యంలో ఈ ఘనత సాధించనుంది. జనాభా పరంగా ఇప్పటికే 1.85 కోట్లకి చేరుకుంది. మున్సిపాలిటీల విలీనంతో మరింత జనాభా పెరగనుంది. జనాభాకు తగ్గట్టుగా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జనాభాతో పాటుగా అభివృద్ధిలోను గ్రేటర్ హైదరాబాద్ దూసుకెళ్లనుంది.
News December 1, 2025
గ్లోబల్ సిటీగా మారనున్న హైదరాబాద్

గ్రేటర్ హైదరాబాద్ త్వరలోనే గ్లోబల్ సిటీగా మారనుంది. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేసిన నేపథ్యంలో ఈ ఘనత సాధించనుంది. జనాభా పరంగా ఇప్పటికే 1.85 కోట్లకి చేరుకుంది. మున్సిపాలిటీల విలీనంతో మరింత జనాభా పెరగనుంది. జనాభాకు తగ్గట్టుగా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జనాభాతో పాటుగా అభివృద్ధిలోను గ్రేటర్ హైదరాబాద్ దూసుకెళ్లనుంది.
News December 1, 2025
అమరావతిలో రూ.750 కోట్లతో యోగా, నేచురోపతి ఇన్స్టిట్యూట్

రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక ‘ఎపెక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా & నేచురోపతి’ ఏర్పాటు కానుంది. దీనికోసం త్వరలో 40 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించనుంది. మొత్తం రూ. 750 కోట్ల భారీ వ్యయంతో దీనిని నిర్మించనున్నారు. ఇందులో 450 పడకల నేచురోపతి ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. అలాగే యోగా, నేచురోపతి కోర్సుల్లో 100 (UG), 20 (PG) సీట్లతో విద్యావకాశాలు కల్పించనున్నారు.


