News March 24, 2025
గజ్వేల్: పాదయాత్రగా వెళ్లి.. సీఎంకి ఫిర్యాదు.!

గజ్వేల్ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి హాజరుకాని మాజీ సీఎం కేసీఆర్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వినతిపత్రం ఇచ్చారు. సీఎం నివాసానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సీఎంకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో సిద్దిపేట నుంచి పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు HYD చేరుకున్నారు.
Similar News
News April 20, 2025
HYDలో 2 దశాబ్దాల తర్వాత పోరు!

HYD స్థానిక కోటా MLC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గత 22 ఏళ్లుగా ఈ స్థానం ఏకగ్రీవమే. ఈ సారి పోటీకి BJP సిద్ధమవడం విశేషం. ఈ కోటాలో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. MIMకు 50 ఓట్లు, BRSకు 24, BJPకి 24, INCకు 14 ఓట్లు ఉన్నాయి. INC ఎన్నికకు దూరం ఉండగా.. BRS ఏకంగా పోలింగ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 23న MIMతో BJP పోటీ పడుతోంది.
News April 20, 2025
లక్ష్మణచాంద: వాగులో బాలుడి మృతదేహం లభ్యం

లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల రాంచరణ్ (14)అనే బాలుడి మృతదేహం స్థానిక వాగులో ఆదివారం లభ్యమైంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. రాంచరణ్ రోజూ లాగే శనివారం మధ్యాహ్నం దోస్తులతో కలిసి వాగులో స్నానం చేయటానికి వెళ్లాడు. ఎస్సారెస్పీ కెనాల్ ప్రవహిస్తున్న కారణంగా వాగులో నీటి ఉద్ధృతి పెరిగి రాంచరణ్ నీటిలో మునిగిపోయి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 20, 2025
విమానాన్ని ఢీకొట్టిన టెంపో వ్యాన్!

బెంగళూరు ఎయిర్పోర్టులో నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ టెంపో వ్యాన్ ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం కింద వ్యాన్ ఇరుక్కున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై ఇండిగో స్పందించింది. ‘బెంగళూరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరుగుతోంది. అది పూర్తైన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.