News March 16, 2025
గజ్వేల్: మొదటి ప్రయత్నంలో గ్రూప్-3లో సత్తా

గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామానికి దినేశ్ మెుదటి ప్రయత్నంలోనే గ్రూప్-3లో మెరిశాడు. కాగా దినేశ్ తండ్రి 2020లో అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత మూడు నెలలకే తల్లి రోడ్డు ప్రమాదంలో గాయాపడ్డి కోమాలోకి వెళ్లి మంచానికే పరిమితమైంది. అయినప్పటికీ కష్టపడి దినేశ్ కేవలం ఆన్లైన్ క్లాసులు మాత్రమే వింటూ..అమ్మను చూసుకుంటూ గ్రూప్-3లో 80వ ర్యాంకు సాధించాడు. దీంతో అతన్ని గ్రామస్థులు అభినందిస్తున్నారు.
Similar News
News December 10, 2025
నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: డీఈఓ విజయ

జవహర్ నవోదయవిద్యాలయంలో 2026-27విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికై నిర్వహించే ప్రవేశ పరీక్షకు జిల్లాలో 6పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయ తెలిపారు. ఈనెల 13న ఉదయం 11:30నుంచి మధ్యాహ్నం 1:30గంటల వరకు పరీక్ష నిర్వహింపబడుతుందన్నారు. జిల్లాలో మొత్తం 1,197 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, మెదక్లో 4, నర్సాపూర్, రామాయంపేటలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.
News December 10, 2025
MDK: బాండ్ పేపర్ హామీలకు ఓట్లు వచ్చేనా?

ఈసారి ఉమ్మడి మెదక్ జిల్లాలో జీపీ ఎన్నికల్లో బాండ్ పేపర్ హామీల ట్రెండ్ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల హామీ బాండ్ ఇచ్చిన మాదిరిగానే జీపీ ఎన్నికల్లో అనేకచోట్ల బాండ్ పై అనేక హామీలతో కూడిన వాగ్దానాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందోనని అభ్యర్థులు, ప్రజలు చూస్తున్నారు. శాసనసభ, లోక్సభ మాదిరిగా జీపీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు గ్రామ ఓటర్లను ఆకట్టుకునేలా హామీలు గుప్పిస్తున్నారు.
News December 10, 2025
మెదక్: 3వ విడతలో 20 జీపీలు ఏకగ్రీవం

మెదక్ జిల్లాలో మూడవ విడతలో జరిగే ఎన్నికల్లో 20 గ్రామ పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమయ్యాయి. 183 గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న ఉపసంహరణల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటించారు. మండలాల వారీగా చిలప్ చెడ్-2, కౌడిపల్లి-7, కుల్చారం-3, నర్సాపూర్-2, శివంపేట- 3, వెల్దుర్తి-3 గ్రామపంచాయతీలలో సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.


