News June 2, 2024

గజ్వేల్: యువకుడి అనుమానాస్పద మృతి.. ఛేదించిన పోలీసులు

image

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గురువారం రాత్రి అనుమానాస్పదంగా <<13346047>>యువకుడు మృతి<<>> చెందిన కేసును పోలీసులు ఛేదించారు. అహ్మదీపూర్ గ్రామానికి చెందిన జమాల్పూర్ సోనీబాయి(34)తో నరేశ్ చారి అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో సోని కూతురిపై నరేశ్ కన్నేశాడని గమనించి, పలుమార్లు మందలించింది. అయినా వినకపోవడంతో కొడుకు జమాల్పూర్ కిషోర్‌తో కలిసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు గజ్వేల్ ACP పురుషోత్తంరెడ్డి తెలిపారు.

Similar News

News December 9, 2025

వంద శాతం ఓటింగ్‌లో పాల్గొనాలి: కలెక్టర్ రాహుల్ రాజ్

image

ప్రజలు వంద శాతం ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మొదటి విడత ఎన్నికల్లో 160 గ్రామ పంచాయతీల్లో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 144 జీపీలకు 411 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. 1402 వార్డుల్లో 332 ఏకగ్రీవం కాగా, పాపన్నపేటలోని అరికెలలో రెండు వార్డులకు నామినేషన్లు రాలేదన్నారు.

News December 9, 2025

మెదక్: ఎన్నికల రోజు స్థానిక సెలవు

image

జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఆయా మండలాల్లో పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. డిసెంబర్ 11, 14, 17న పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు.

News December 9, 2025

మెదక్: సీఐటీయూ రాష్ట్ర మహాసభలు.. 39 తీర్మానాలు ఆమోదం

image

మెదక్ పట్టణంలో జరిగిన సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలు మంగళవారం ముగిశాయి. రాష్ట్ర కార్యదర్శి వీఎస్ రావు ప్రవేశపెట్టిన 39 తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా శ్రమశక్తి నీతి-2025ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.