News December 2, 2024
గజ్వేల్: KCR ఇలాకాలో రేవంత్ రెడ్డి మాట ఇదే!

సిద్దిపేట జిల్లాలో నేడు <<14764463>>CM రేవంత్ రెడ్డి పర్యటన<<>> విషయం తెలిసిందే. గజ్వేల్ పరిధి బండ తిమ్మాపూర్లో హిందుస్థాన్ కోకాకోలా కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. కాగా ఏడాది క్రితం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన గజ్వేల్ ప్రజలకు పరిశ్రమలు తెస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు CM హోదాలో పరిశ్రమలు ప్రారంభించనున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
Similar News
News February 7, 2025
మెదక్: అప్పుడే మండుతున్న ఎండలు

గత కొన్ని రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లాలో 35.8 డిగ్రీలు నమోదైంది. ఫిబ్రవరి తొలి వారంలోనే పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా రికార్డు అవుతున్నాయి. దీంతో ఇప్పుడే ఇలా ఉంటే మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని జనం ఆందోళన చెందుతున్నారు. పొద్దున, సాయంత్రం చల్లగా ఉన్నప్పటికీ పగటిపూట ఎండలు సుర్రుమంటున్నాయి.
News February 7, 2025
గజ్వేల్లో యాక్సిడెంట్.. ఇద్దరి దుర్మరణం

గజ్వేల్ పరిధిలో రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గోదావరిఖని నుంచి HYD వైపు వెళ్తున్న కారు, ఆగి ఉన్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోదావరిఖనికి చెందిన బాణేశ్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండటంతో గజ్వేల్ వైద్యులు హైదరాబాద్కు రిఫర్ చేశారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్కు స్వల్ప గాయాలయ్యాయి.
News February 7, 2025
ఆత్మహత్యలు కాదు.. కొట్లాడుదాం.. ప్రజలకు హరీశ్ రావు పిలుపు

లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామ సభలో పురుగు మందు తాగిన ములుగు జిల్లా బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం బాధాకరమని హరీశ్ రావు విచారం వ్యక్తం చేశారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ అన్నారు. ఆత్మహత్యలు వద్దు.. కొట్లాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు.