News October 27, 2024
గడువులోగా పూర్తి కావాలి: SKLM కలెక్టర్

జిల్లా వెంబడి ప్రవహిస్తున్న ప్రధాన నదులైన నాగావళి, వంశధార నదుల అనుసంధానం జూన్ 2025 నాటికి పూర్తిచేసేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. పలు ప్రాజెక్టుల ముఖ్య అధికారులతో కలెక్టరేట్లో శనివారం జేసీ అహ్మద్తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. నదుల అనుసంధానానికి సంబంధించి ఇప్పటికే రూ.106 కోట్ల ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేసినట్లు వివరించారు.
Similar News
News November 25, 2025
Way2News వార్తకు రెస్పాన్స్: యూనివర్సిటీలో భవనం ప్రారంభం

డాక్టర్. బీ.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీలో నిరుపయోగంగా భవనం దర్శనమిస్తోంది. దీనిపై అక్టోబర్ 24న ‘ఈ భవనాన్ని వినియోగంలోకి <<18091663>>తేవాలి<<>>’ అనే శీర్షికతో Way2Newsలో వార్త ప్రచురితమవ్వగా అధికారులు స్పందించారు. భవంతిని వాడుకలో తెచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. నేడు ప్రారంభానికి పలువురి ప్రజాప్రతినిధులకు ఆహ్వానమిచ్చారు. రూ.34 కోట్లతో నిర్మితమైన భవనాన్ని క్లాస్ రూంలు, ఇతర కార్యకలాపాలకు ఉపయోగించనున్నారు.
News November 25, 2025
ఎచ్చెర్ల : స్పాట్ అడ్మిషన్లకు కసరత్తు

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ పీజీ సెట్-2025 ద్వారా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేయగా 19 కోర్సుల్లో 600 సీట్లకు 252 ప్రవేశాలు జరిగాయి. కొన్ని కోర్సుల్లో ఎక్కువగా సీట్లు మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాయి. త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.
News November 25, 2025
కంచిలి: విషాదం.. 8నెలల గర్భిణి మృతి

మరో నెల రోజులు గడిచి ఉంటే ఆమెకు పండంటి బిడ్డ పుట్టేది. అమ్మగారితో పాటు అత్తగారింట్లో చిన్నారి అడుగులు పడేవి. ఇంతలోనే విషాదం నెలకొంది. బయటి ప్రపంచంలోకి రాకముందే తల్లితో పాటు ఆ శిశువు కన్నుమూసింది. కంచిలి(M) అర్జునాపురానికి చెందిన ధనలక్ష్మి(26) 8నెలల గర్భిణి. నిన్న రాత్రి పురిటి నొప్పులొచ్చాయి. 108కు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలిస్తుండగా బిడ్డతో సహా ధనలక్ష్మి ప్రాణాలొదిలింది.


