News September 10, 2024
గడువులోగా సమస్యలను పరిష్కరించాలి: ఎస్పీ

ఫిర్యాదు దారుని సమస్యల పట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
Similar News
News November 18, 2025
ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.
News November 18, 2025
ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.
News November 18, 2025
మాదక ద్రవ్యాల నిర్మూలనకు గుంటూరు పోలీసుల ‘సంకల్పం’

జిల్లాలో మాదక ద్రవ్యాలను సమూలంగా అరికట్టేందుకు గుంటూరు పోలీసులు సరికొత్త అస్త్రం సిద్ధం చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సంకల్పం అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తంగా కాలేజీల్లో యువతకు అవగాహన కల్పించనున్నారు. తొలిగా తుళ్లూరు పీఎస్ పరిధిలోని VIT యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.


