News January 23, 2025

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మకంచలో గల మినీ స్టేడియాన్ని డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరైన జాగ్రత్తలను పాటించాలని, అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.

Similar News

News November 27, 2025

పెళ్లికి రెడీ.. అమ్మాయి కావాలి అంతే: చాహల్

image

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ ఫొటోలను షేర్ చేసిన ఈ స్పిన్నర్.. ‘నేను పెళ్లికి రెడీగా ఉన్నా. అమ్మాయి కావాలి అంతే’ అని క్యాప్షన్ పెట్టారు. భార్యతో విడాకులు అయితే చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్తారని, కానీ చాహల్ కాన్ఫిడెన్స్‌కు మెచ్చుకోవాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News November 27, 2025

ములుగు: ఎన్నికల సమాచారం కోసం కంట్రోల్ రూమ్

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 48 సర్పంచ్, 420 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నిర్వహణ కోసం ఫ్లయింగ్, స్టాటిస్టిక్, వీడియో సర్వేలెన్స్ బృందాలు, ఎంసీఎంసీ, ఎంసీసీ, ఇతర ఎన్నికల సంబంధిత పర్యవేక్షణ అధికారులను నియమించామని చెప్పారు.

News November 27, 2025

బాధ్యతతో విధులు నిర్వర్తించాలి: ములుగు SP

image

మేడారం జాతర ఏర్పాట్లలో అలసత్వం వహించొద్దని ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ అన్నారు. ములుగులో మేడారం జాతరపై సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జాతరలో ఎలాంటి అలసత్వం వహించొద్దని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై విస్తృతంగా చర్చించి, ప్రతి అధికారి వారికి అప్పగించిన పనిని నిబద్ధత, బాధ్యతతో నిర్వర్తించాలన్నారు.