News January 23, 2025
గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మకంచలో గల మినీ స్టేడియాన్ని డీసీపీ రాజ మహేంద్ర నాయక్తో జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరైన జాగ్రత్తలను పాటించాలని, అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.
Similar News
News December 5, 2025
CEOలనూ AI వదలదు: రచయిత స్టువర్ట్

ఫ్యూచర్లో CEO ఉద్యోగాలనూ AI లాగేసుకునే ఛాన్స్ ఉందని ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఎ మోడ్రన్ అప్రోచ్’ పుస్తక సహ రచయిత స్టువర్ట్ రస్సెల్ అభిప్రాయపడ్డారు. AIకి నిర్ణయాధికారం ఇవ్వాలని లేదంటే తప్పుకోవాలని బోర్డు సభ్యులు CEOను డిమాండ్ చేసే అవకాశం ఉండొచ్చన్నారు. పని అనుకునే ప్రతి దాన్నీ AI చేసేస్తోందన్నారు. ఇప్పటికే కార్మికులు, డ్రైవర్లు, కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ల ఉద్యోగాలు నష్టపోతున్నామనే చర్చ జరుగుతోంది.
News December 5, 2025
ఖమ్మం: విద్యుత్ షాక్తో యువకుడి మృతి

విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News December 5, 2025
డిసెంబర్ 5: చరిత్రలో ఈ రోజు

*1901: హాలీవుడ్ దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
*1905: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం షేక్ అబ్దుల్లా జననం
*1985: టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధవన్ జననం
*1992: హీరోయిన్ పాయల్ రాజ్పుత్ జననం
*2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(ఫొటోలో) మరణం
*2016: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం
* ప్రపంచ నేల దినోత్సవం


