News January 23, 2025

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మకంచలో గల మినీ స్టేడియాన్ని డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరైన జాగ్రత్తలను పాటించాలని, అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.

Similar News

News November 25, 2025

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

ఇస్రో-<>విక్రమ్ <<>>సారాభాయ్ స్పేస్ సెంటర్ 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 70ఏళ్లలోపు ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. chsshelp@vssc.gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వెబ్‌సైట్: www.vssc.gov.in

News November 25, 2025

మదనపల్లెలోకి పుంగనూరు.. తిరుపతిలోకి నగరి

image

చిత్తూరు జిల్లా స్వరూపం మరోసారి మారనుంది. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను కొత్తగా ఏర్పడబోయే మదనపల్లె జిల్లాలో చేరుస్తారు. నగరి డివిజన్ మొత్తాన్ని తిరుపతి జిల్లాలోకి మార్చనున్నారు. నగరి, నిండ్ర, విజయపురాన్ని తిరుపతిలో కలిపి.. పాలసముద్రాన్ని చిత్తూరు డివిజన్‌లోకి మారుస్తారని సమాచారం. వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తిరుపతిలో కలపాలనే ప్రజల డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోలేదు.

News November 25, 2025

కృష్ణా: నాడు నేడు పనులు పూర్తి చేస్తే బాగు.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాడు-నేడు పథకం కింద 80 నుంచి 90% వరకు పూర్తయిన పనులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు లేక అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో 175, కృష్ణా జిల్లాలో 100 పైగా పాఠశాలల్లో అదనపు గదులు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. సుమారు 600 పైగా స్కూళ్లలో పెయింటింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.