News January 23, 2025

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మకంచలో గల మినీ స్టేడియాన్ని డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌తో జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరైన జాగ్రత్తలను పాటించాలని, అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేయాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.

Similar News

News November 22, 2025

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఏపీ మంత్రి

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు. వేదాశీర్వచనం చేసి స్వామి వారి లడ్డూ ప్రసాదంతోపాటు స్వామి వారి ఫొటో ఆలయ అధికారులు అందజేశారు.

News November 22, 2025

అన్నమయ్య: అసెంబ్లీలో మాట్లాడేది వీళ్లే..!

image

రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ కోసం అన్నమయ్య జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. డైట్‌లో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. వీళ్లు వాళ్ల నియోజకవర్గంలోని సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతారు.
మదనపల్లె:ఎం.పార్థసారథి
పీలేరు:కె.తేజశ్రీ
తంబళ్లపల్లె:జె.అనిల్ కుమార్
రాయచోటి: ఎం.సుష్మతాజ్
రాజంపేట: కొల్లి వీక్షిత, పట్నం సాయి
రైల్వేకోడూరు: ఎస్.నూర్ ఆయేషా

News November 22, 2025

HYD: అన్నపూర్ణ ఫిల్మ్ అకాడమీని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

image

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినీ నటుడు నాగార్జునతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. 1970లలో సరైన వసతులు లేనప్పుడు దిగ్గజ అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియోను స్థాపించడం, అది హైదరాబాద్‌లో ముఖ్యమైన సాంస్కృతిక ల్యాండ్‌మార్క్‌గా ఎదగడంపై డిప్యూటీ సీఎం ప్రశంసలు కురిపించారు.