News January 25, 2025
గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: BHPL కలెక్టర్

గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని డా బీఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం, తదుపరి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.
Similar News
News February 14, 2025
NZB: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన మహిళ అరెస్ట్

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో మహిళని మావల పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎస్ఐ విష్ణువర్ధన్ వివరాల ప్రకారం.. NZBకు చెందిన స్వరూప అనే మహిళ ADBలోని రాంనగర్కు చెందిన సాయితేజకు వెటర్నరీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.50 లక్షలు తీసుకుంది. ఎంతకీ ఉద్యోగం ఇప్పించకపోగా రేపు మాపు అంటూ వాయిదాలు వేస్తోంది. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News February 14, 2025
యాదాద్రి భువనగిరి బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అశోక్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ నూతన జిల్లా అధ్యక్షుడిగా ఉట్కూరి అశోక్ గౌడ్ నియామకమయ్యారు. తెలంగాణ సంఘటన పర్వ్ 2024 ఎన్నికల నియామవళి ఆధారంగా ఆ పార్టీ ఆయనను నూతన అధ్యక్షుడిగా నియమించింది. రాజపేటకు చెందిన ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి ముప్పై ఏండ్ల నుంచి బీజేపీకి అనేక సేవలు అందించారు. అశోక్ గౌడ్ నూతన అధ్యక్షుడిగా నియామకం కావడంతో జిల్లా వ్యాప్తంగా ఆయనకు పార్టీ నేతలు అభినందనలు తెలుపుతున్నారు.
News February 14, 2025
ADB: MH మద్యం స్వాధీనం.. ఒకరి ARREST

జైనథ్, భోరజ్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు గురువారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పార్డి (బి)లో అక్రమంగా దేశీదారు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 46 దేశీదారు బాటిల్లు, టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ విజేందర్ తెలిపారు. అక్రమంగా దేశీదారు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.