News January 23, 2025
గణతంత్ర వేడుకలకు గంగదేవిపల్లి మాజీ సర్పంచ్కు ఆహ్వానం

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు గీసుగొండ మండలం జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి తాజా మాజీ సర్పంచ్ గోనె మల్లారెడ్డికి ఆహ్వానం అందినట్లు ఆయన చెప్పారు. గంగదేవిపల్లి అభివృద్ధి చెందిన విధానంపై పలుమార్లు ప్రసార భారతి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. గ్రామ ప్రజలు ఐక్యతతో సాధించిన అభివృద్ధికి తనకు ఆహ్వానం అందిందని మల్లారెడ్డి తెలిపారు.
Similar News
News December 10, 2025
U19 హెడ్ కోచ్పై క్రికెటర్ల దాడి.. CAPలో కలకలం

పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్(CAP)లో కోచ్పై దాడి జరగడం కలకలం రేపింది. U19 హెడ్ కోచ్ వెంకటరామన్పై ముగ్గురు లోకల్ క్రికెటర్లు బ్యాటుతో దాడి చేశారు. దీంతో ఆయన తలకు గాయమై 20 కుట్లు పడ్డాయి. SMATకు ఎంపిక చేయకపోవడంతోనే ఈ అటాక్ జరిగినట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లోకల్ ప్లేయర్లను కాదని ఫేక్ డాక్యుమెంట్లతో నాన్ లోకల్ ప్లేయర్లకు అవకాశాలు ఇస్తున్నారని CAPపై ఆరోపణలున్నాయి.
News December 10, 2025
ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి

ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి చెందింది. కంబాలకొండ నుంచి జింకలు తరచుగా రోడ్డుపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జింక రోడ్డుపైకి ఆకస్మికంగా రావడంతో, అటుగా వస్తున్న బస్సు ఢీకొంది. జింక అక్కడికక్కడే మృతి చెందింది. కంబాలకొండ అడవి నుంచి ఇలా రోడ్డెక్కిన జింకలు తరచుగా ప్రమాదాలకు గురై, తీవ్ర గాయాలు లేదా మరణం సంభవిస్తున్నాయి. మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News December 10, 2025
150 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<


