News January 23, 2025
గణతంత్ర వేడుకలకు గంగదేవిపల్లి మాజీ సర్పంచ్కు ఆహ్వానం

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు గీసుగొండ మండలం జాతీయ ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లి తాజా మాజీ సర్పంచ్ గోనె మల్లారెడ్డికి ఆహ్వానం అందినట్లు ఆయన చెప్పారు. గంగదేవిపల్లి అభివృద్ధి చెందిన విధానంపై పలుమార్లు ప్రసార భారతి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు. గ్రామ ప్రజలు ఐక్యతతో సాధించిన అభివృద్ధికి తనకు ఆహ్వానం అందిందని మల్లారెడ్డి తెలిపారు.
Similar News
News December 2, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామలో అరుదైన కపాల శాస్త్ర చికిత్స
> శ్రీపతిపల్లి సర్పంచ్ బరిలో సొంత అన్నదమ్ములు
> నర్మెట్ట: వైద్య వృత్తిని వదిలి ప్రజాసేవలోకి.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్
> తీగల తండా సర్పంచ్ గా సాంబరాజు యాదవ్ ఏకగ్రీవం
> నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగాలి ఎన్నికల అబ్జర్వర్
> ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలి: అదనపు కలెక్టర్
> ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జనగామ జిల్లా కలెక్టర్
News December 2, 2025
పాలమూరు: ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలి

సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఓటర్లు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తమ పోలీస్ అధికారులకు సహకరించాలని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తమ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 2, 2025
తిరుమల: టికెట్ల లింకులు ఓపెన్ కాక అవస్థలు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు లింక్ ద్వారా టికెట్లు పొందుతుంటారు. మంగళవారం దర్శనానికి సంబంధించి సోమవారం భక్తులకు మెసేజ్ ద్వారా లింక్ వచ్చింది. అయితే అది ఓపెన్ కాకపోవడంతో భక్తులు ఆందోళన చెందారు. దీంతో ఎంబీసీ వద్ద నేరుగా వెళ్లి టికెట్లు పొందుతున్నారు.


