News March 3, 2025

గణనీయంగా తగ్గిన గంజాయి సాగు: హోం మంత్రి

image

కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల కారణంగా రాష్ట్రంలో గంజాయి సాగు గణనీయంగా తగ్గిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సోమవారం సమాధానం ఇస్తూ 11,000 ఎకరాల నుంచి గంజాయి సాగు ప్రస్తుతం 100 ఎకరాలకు తగ్గిందన్నారు. గంజాయి సాగును పూర్తిగా నిర్వీర్యం చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నియమించిన ఈగల్ టీం గంజాయి నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 23, 2025

పల్నాడు జిల్లాలోని లాడ్జిలో వ్యభిచారం గుట్టురట్టు!

image

నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తుండగా ఎస్ఐ అరుణ తన సిబ్బందితో సోమవారం రాత్రి మెరుపు దాడి చేశారు. ఈ దాడులలో బాపట్ల జిల్లా సంతమాగులూరు చెందిన షేక్ గౌస్ బాజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నరసరావుపేటలో వ్యభిచార గృహాలపై పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నా పదేపదే వ్యభిచారం నిర్వహిస్తూ మళ్లీమళ్లీ పట్టు బడుతున్నారు.

News December 23, 2025

అధికారులే అన్నీ చూసుకున్నారు.. సిట్ ప్రశ్నలపై చెవిరెడ్డి!

image

AP: తిరుమల కల్తీ నెయ్యి విషయంలో SIT ప్రశ్నలకు YCP నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరైన జవాబు ఇవ్వలేదని తెలుస్తోంది. టెండర్ రూల్స్‌లో మార్పులపై ప్రశ్నించగా, అధికారులే చూసుకున్నారని చెప్పినట్లు సమాచారం. వారు చెబితేనే కొనుగోలు కమిటీ సిఫార్సులు ఆమోదించానని అన్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో ఉన్న చెవిరెడ్డిని SIT 4గంటలపాటు విచారించింది. అప్పట్లో TTD కొనుగోళ్ల కమిటీ సభ్యుడిగా ఆయన ఉన్నారు.

News December 23, 2025

అన్నవరంలో ఆరుగురు పురోహితులపై వేటు

image

అన్నవరం సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాల్లో భక్తుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసిన ఆరుగురు వ్రత పురోహితులపై వేటు పడింది. ఈ నెల 21న పాలకొల్లులో నిర్వహించిన వ్రతాల్లో ఈ అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఈఓ త్రినాథరావు ఈ చర్యలు తీసుకున్నారు. ఒక గుమస్తాకు నోటీసు జారీ చేశారు. మంత్రి రామానాయుడు సిఫార్సుతో ఈ వ్రతాలు జరిగిన విషయం తెలిసిందే.