News January 28, 2025
గణితం ప్రశ్నల సంకలన దీపిక ఆవిష్కరించిన డీఈఓ

బొంతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితం ఉపాధ్యాయుడు ప్రసాద్ పదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన గణిత ప్రశ్నల సంకలన దీపికను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సంగారెడ్డిలోని కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. డీఈవో మాట్లాడుతూ.. ఈ దీపికను అన్ని పాఠశాలలకు పంపించాలని చెప్పారు. గణితంలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో DCEB కార్యదర్శి లింబాజి పాల్గొన్నారు.
Similar News
News September 16, 2025
నేడు భారీ వర్షాలు

APలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలకు అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. అటు TGలో వరంగల్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, పెద్దపల్లి, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని IMD తెలిపింది.
News September 16, 2025
అన్నమయ్య జిల్లా ఉద్యానవన పంటల విస్తరణపై CM దృష్టి

అమరావతిలో జరిగిన నాలుగవ కలెక్టర్ల సదస్సులో CBN అన్నమయ్య జిల్లాలో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని పెంచాలని సోమవారం కలెక్టర్కు సూచించారు. జిల్లాలో ఎక్కువగా వ్యవసాయాధారిత రైతులు ఉన్నారని, వర్షాభావం వల్ల సాగు తగ్గిందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ CMకు తెలిపారు. ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రణాళికతో ముందడుగు వేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
News September 16, 2025
మెగా డీఎస్సీ: విజయవాడలో 5వేల మందికి బస

AP: మెగా DSCలో ఉద్యోగం సాధించిన నూతన టీచర్లకు ఈ నెల 19న CM చంద్రబాబు అమరావతిలో నియామక పత్రాలు అందించనున్నారు. దీని కోసం జోన్-1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి ఈ నెల 18 సాయంత్రానికి సుమారు 5వేల మంది విజయవాడ రానున్నారు. వారికి బస కోసం 13 పాఠశాలలను కేటాయించారు. అటు రాయలసీమలోని సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి గుంటూరులో ఏర్పాట్లు చేస్తున్నారు.