News January 28, 2025

గణితం ప్రశ్నల సంకలన దీపిక ఆవిష్కరించిన డీఈఓ

image

బొంతపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణితం ఉపాధ్యాయుడు ప్రసాద్ పదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన గణిత ప్రశ్నల సంకలన దీపికను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సంగారెడ్డిలోని కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. డీఈవో మాట్లాడుతూ.. ఈ దీపికను అన్ని పాఠశాలలకు పంపించాలని చెప్పారు. గణితంలో 100% ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో DCEB కార్యదర్శి లింబాజి పాల్గొన్నారు.

Similar News

News December 4, 2025

HYD: కేటీఆర్ పర్యటనలో కెమెరామెన్ మృతి

image

కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. విడియో తీస్తుండగా గుండె నొప్పితో ఆజ్ తక్ ఛానల్ కెమెరామెన్ దామోదర్ కుప్పకూలారు. గమనించిన పోలీసులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దామోదర్ మృతి చెందారు. మృతదేహం గాంధీ మార్చరికి తరలించారు.

News December 4, 2025

మునుగోడులో ‘ప్రత్యేక’ మద్యం పాలసీ.!

image

నల్గొండ జిల్లాలో కొత్త మద్యం పాలసీ అమలుపై ఎక్సైజ్ అధికారుల నుంచి స్పష్టత కొరవడింది. మునుగోడు నియోజకవర్గం మినహా జిల్లా అంతటా వైన్ షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. అయితే, మునుగోడులో మాత్రం మధ్యాహ్నం 1 గంట తర్వాత తెరిచి, రాత్రి 9 గంటలకు మూసేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ‘ప్రత్యేక’ పాలసీపై ఎక్సైజ్ అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.

News December 4, 2025

గుర్తింపు, పదవుల కోసం పాకులాడను: పవన్

image

AP: నిస్సహాయులకు అండగా నిలబడటమే నాయకుడి లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. చిత్తూరులో కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. తాను గుర్తింపు, పదవుల కోసం పాకులాడలేదని తెలిపారు. ప్రజలకు సేవ చేసే ప్రయాణంలో పదవి వస్తే అలంకారం కాదు బాధ్యత అని నమ్ముతానన్నారు. అదృష్టవశాత్తు తన పేషీలోని అధికారులు కూడా సమాజానికి మంచి చేద్దాం అనే తపన ఉన్నవాళ్లేనని పేర్కొన్నారు.