News January 27, 2025
గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు: కడియం కావ్య

గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల సంక్షేమ పథకాల మంజూరు పత్రాలను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 3, 2026
జూలూరుపాడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్పై సస్పెన్షన్ వేటు..!

జూలూరుపాడు రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. పాపకొల్లులోని సదరు అధికారి నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా కలప నిల్వ ఉంచినట్లు తేలడంతో డీఎఫ్ఓ కిష్టగౌడ్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఆర్ఓ ప్రసాదరావును వివరణ కోరగా సస్పెండ్ చేస్తూ డీఎఫ్ఓ ఉత్తర్వులు జారీ చేసినట్లు ధ్రువీకరించారు.
News January 3, 2026
బస్ డ్రైవర్ నుంచి దేశాధ్యక్షుడి వరకు

వెనిజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నామని ట్రంప్ చేసిన <<18751661>>ప్రకటన<<>>తో మదురో పేరు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బస్ డ్రైవర్గా జీవితాన్ని ప్రారంభించి దేశాధ్యక్షుడిగా ఎదిగిన వ్యక్తి మదురో. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన, హ్యూగో చావెజ్కు అనుచరుడిగా రాజకీయాల్లో ఎదిగారు. చావెజ్ మరణం తర్వాత 2013లో అధ్యక్షుడయ్యారు. అయితే ఆర్థిక సంక్షోభం, మానవ హక్కుల ఉల్లంఘన సహా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
News January 3, 2026
ఫొటో సిమిలర్ ఎంట్రీలు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీల ప్రక్రియను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో రివిజన్ మ్యాపింగ్ 56.87 శాతం పూర్తయిందన్నారు. ఓటరు జాబితా స్వచ్ఛత, పారదర్శకత కోసం ఈ ప్రక్రియ కీలకమని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలించి అర్హులైన ఓటర్ల వివరాలు సరిచేయాలని ఆదేశించారు.


