News July 8, 2024
గత ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపించింది: MP

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపించిందని రాజమండ్రి ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి విమర్శించారు. సోమవారం రాజమండ్రిలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. NDA ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. వీరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా NDA ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందిస్తుందని తెలిపారు.
Similar News
News December 22, 2025
బీచ్ వాలీబాల్లో మెరిసిన తూ.గో కుర్రాళ్లు

బాపట్లలో జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో దుద్దుకూరుకు చెందిన మల్లిపూడి చందు, తాడిపూడికి చెందిన వేములూరు కార్తీక్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్థులు వీరిని ఘనంగా అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తామని యువకులు ధీమా వ్యక్తం చేశారు.
News December 22, 2025
రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం 1100 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలని కోరారు. అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు.
News December 22, 2025
రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS నిర్వహించనున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్ తెలిపారు. ప్రజలు తమ అర్జీలను వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం 1100 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలని కోరారు. అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వెల్లడించారు.


