News April 16, 2025

గద్వాలలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

మానవపాడు మండలం క్రాస్ రోడ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. కర్నూల్ వైపు నుంచి హైదరాబాద్ వైపు బైక్‌పై వెళ్తున్న గుర్తుతెలియని తెలియని వ్యక్తిని ఓ వాహనం ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి మానవపాడు పోలీసులు చేరుకున్నారు.

Similar News

News September 18, 2025

భూపాలపల్లిలో పువ్వుల పండుగ జరిగేది ఇక్కడే..!

image

ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలకు భూపాలపల్లి జిల్లా సిద్ధం అవుతోంది. రసంకుంట(గోరి కొత్తపల్లి), గణపేశ్వరాలయం(గణపసముద్రం), మామిడి కుంట చెరువు(చిట్యాల), దామెర చెరువు(రేగొండ), నైన్‌పాక ఆలయం(చిట్యాల), అయ్యప్ప దేవాలయం(కాటారం), టెకుమట్ల చెరువు, కాళేశ్వరం(మహదేవపూర్)తో పాటు పలిమెల, మల్హర్ మండలాల్లోని పలు చోట్ల వేడుకలు ఘనంగా జరుగుతాయి. మీ గ్రామంలో వేడుకలు ఎక్కడ జరుగుతాయో లొకేషన్ కామెంట్ చేయండి.

News September 18, 2025

పాలమూరు RTCలో ఉద్యోగాలు

image

సుదీర్ఘ విరామం తర్వాత <<17746081>>ఆర్టీసీలో ఉద్యోగాల<<>> భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి MBNR రీజియన్‌లో ఖాళీలు ఇలా ఉన్నాయి. MBNRలో డ్రైవర్ 20, శ్రామిక్ పోస్టులు 5, NGKLలో డ్రైవర్ 20, శ్రామిక్ 2, GWLలో డ్రైవర్ 13, శ్రామిక్ 4, WNPలో డ్రైవర్ 13, శ్రామిక్ 4, NRPTలో డ్రైవర్ 13, శ్రామిక్ 3 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
-SHARE IT

News September 18, 2025

తల్లిపాలు ఎలా మాన్పించాలంటే..!

image

శిశువు ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యం. కానీ వయసు పెరుగుతున్నా కొందరు పిల్లలు పాలు మానరు. దీనికోసం ఒకేసారి మాన్పించకుండా పాలు ఇచ్చే వ్యవధి తగ్గింస్తుండాలి. లేదంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పిల్లలకు కడుపునిండా ఆహారాన్ని ఇవ్వాలి. ఏడాది తర్వాత నుంచి ఘన పదార్థాలు అలవాటు చెయ్యాలి. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు ఇవ్వడం, పాలు అడిగినప్పుడు వారిని డైవర్ట్ చేయడం వల్ల నెమ్మదిగా మానేస్తారు.