News March 6, 2025
గద్వాలలో 9 మందికి నెల రోజుల జైలు శిక్ష

ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన కేసులో 9 మంది నిందితులకు నెల రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి వేయ్యి జరిమానా విధిస్తూ MBNR ఫస్ట్ ADJ కోర్ట్ జడ్జి తీర్పు ఇచ్చారని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. గతంలో జిల్లా వ్యవసాయ మార్కెట్లో వేరుశనగకు ధర తక్కువగా వచ్చిందని మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో కేసు నమోదు అయిందన్నారు.
Similar News
News November 23, 2025
OP సిందూర్పై పాక్ ఫేక్ న్యూస్.. తిప్పికొట్టిన ఫ్రెంచ్ నేవీ

ఆపరేషన్ సిందూర్పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పాకిస్థానీ మీడియాపై ఫ్రెంచ్ నేవీ విమర్శలు గుప్పించింది. మేలో జరిగిన ఘర్షణల్లో భారత రఫేల్ జెట్లను కూల్చి పాక్ వాయుసేన ఆధిపత్యం చెలాయించిందంటూ ఓ ఫ్రెంచ్ ఆఫీసర్ చెప్పినట్లుగా అక్కడి మీడియా రాసుకొచ్చింది. అది అసత్యాలతో కూడిన కల్పిత కథనమని ఫ్రెంచ్ నేవీ పేర్కొంది. ఆ ఆఫీసర్ పేరు కూడా తప్పేనని, అతను ఎలాంటి ప్రకటనా చేయలేదని స్పష్టం చేసింది.
News November 23, 2025
ములుగు: మహిళా సంఘాలకు మంత్రి శుభవార్త

ములుగు జిల్లా మహిళా సంఘాలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. రానున్న మేడారం జాతర సమయంలో వేలాది మంది భక్తులు జాతరకు వస్తారని, ఈ సందర్భంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఫుడ్ కోర్ట్స్, దుకాణాలు, వ్యాపారాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు.
News November 23, 2025
భారీ జీతంతో SIDBIలో ఉద్యోగాలు

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<


