News March 6, 2025
గద్వాలలో 9 మందికి నెల రోజుల జైలు శిక్ష

ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన కేసులో 9 మంది నిందితులకు నెల రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికి వేయ్యి జరిమానా విధిస్తూ MBNR ఫస్ట్ ADJ కోర్ట్ జడ్జి తీర్పు ఇచ్చారని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. గతంలో జిల్లా వ్యవసాయ మార్కెట్లో వేరుశనగకు ధర తక్కువగా వచ్చిందని మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో కేసు నమోదు అయిందన్నారు.
Similar News
News October 23, 2025
వనపర్తి జిల్లాలో 24 గంటల్లో నమోదైన వర్షపాతం

వనపర్తి జిల్లాలో 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా అత్యధికంగా విల్లియంకొండలో 10.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఏదుల 7.5 మి.మీ, ఆత్మకూర్ 7.3 మి.మీ, రేమెద్దుల 5.5 మి.మీ, జానంపేట 4.5 మి.మీ, వీపనగండ్ల 2.5 మి.మీ, వనపర్తి, వెలుగొండ, కేతపల్లి 1.8 మి.మీ, పెబ్బేరు 1.0 మి.మీ, రేవల్లి 0.8 మి.మీ, రేవల్లి 0.5 మి.మీ, మిగతా 8 కేంద్రాలలో 0.0 మి.మీ వర్షపాతం నమోదయింది.
News October 23, 2025
కృష్ణా: పొలాలపై వరుణుడి ఎఫెక్ట్

జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. కంకి దశకు చేరిన వరి పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే సమయంలో వర్షాలు విరుచుకుపడడంతో నష్టపోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు. వర్షం మరికొన్ని రోజులు కొనసాగితే పంటలు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.
News October 23, 2025
ఇంజనీర్ టూ రౌడీ షీటర్..

ఇంజనీరింగ్ చదువుకున్న చింటూ మరైన్ ఇంజనీరింగ్గా పనిచేశారు. అనంతరం మేనమామ కటారి మోహన్కు రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచారు. చిత్తూరును అప్పట్లో శాసిస్తున్న సీకే బాబుకు దీటుగా చింటూ అంచెలంచెలుగా ఎదిగారు. 2007 డిసెంబర్ 31న సీకే బాబుపై జరిగిన బాంబ్ బ్లాస్ట్, అనంతరం గన్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి యావజ్జీవ శిక్ష వేశారు. ప్రస్తుత కేసులో అనేక షరత్తులతో బెయిల్పై ఉన్నారు.