News October 16, 2024
గద్వాల్: ఎల్ఆర్ఎస్ సమస్యలను పరిష్కరించాలి:కలెక్టర్
గ్రామపంచాయతీ స్థాయిలో పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాలులో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణస్థాయిలో ఉన్న LRS క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా చేయాలని సూచించారు.
Similar News
News October 16, 2024
ఉమ్మడి MBNR జిల్లాలో నేటి వర్షపాత వివరాలు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా వీపనగండ్ల 29.5 మి.మీ వర్షపాతం నమోదయింది. నాగర్కర్నూల్ జిల్లా ఎళ్లికల్లో 27.8 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 26.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా కోదండపూర్లో 23.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల్లో 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
News October 16, 2024
BREAKING: నాగర్కర్నూల్: దంపతుల దారుణ హత్య
రంగారెడ్డి జిల్లాలో దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కందుకూరు PS పరిధి కొత్తగూడ ఫామ్ హౌస్లో దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ఉషయ్య(55), శాంతమ్మ(50)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 16, 2024
శ్రీశైలానికి 1,23,314 క్యూసెక్కుల వరద
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. సుమారుగా 1,23,314 క్యూసెక్కుల వరద వస్తోంది. బుధవారం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది.శ్రీశైలం ప్రాజెక్ట్ భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 16.415 ఎం.యూ. విద్యుదుత్పత్తి చేస్తూ 35,315, కుడిగట్టు కేంద్రంలో 15.015 మి.యూ. విద్యుదుత్పత్తి చేస్తూ 30,752 క్యూసెక్కులు మొత్తం 66,067 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు.