News March 24, 2025

గద్వాల్: కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన

image

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్‌డీఎస్ రైతులు సాగు నీరు గత రెండు వారాల నుంచి ఇవ్వడం లేదని, పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, వెంటనే సాగు నీరు అందివ్వాలని సుమారు పన్నెండు గ్రామాల రైతులు కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు తమ సమస్యలు పరిష్కరించాలని తెలపగా సానుకూలంగా స్పందించారు.

Similar News

News December 1, 2025

ADB: ‘డబ్బు పంపండి.. లేదంటే న్యూడ్ ఫొటోలు పంపుతాం’

image

ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బోథ్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడికి ఓ నంబర్ నుంచి కాల్ వచ్చింది. వెంటనే తన అకౌంట్‌కు డబ్బులు పంపాలని లేదంటే బాధితుడి న్యూడ్ ఫొటోలు ఫ్రెండ్స్‌కు, రిలేటివ్స్‌కు పంపుతాం అని హిందీలో బెదిరించారు. ఫోన్ నంబర్ పాకిస్థాన్‌కు చెందినదిగా గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

News December 1, 2025

పానీపూరీ కోసం తెరిచిన నోరు మూసుకోలేదు

image

UP ఔరైయాలో వింత ఘటన జరిగింది. పానీపూరి తినబోయిన మహిళ దవడ డిస్‌లొకేట్ అయ్యింది. మేనకోడలు డెలివరీ కోసం ఇంకాలా దేవి ఆస్పత్రికి వెళ్లారు. పిల్లలతో కలిసి ఆవిడ కూడా పానీపూరీ తినేందుకు వెళ్లారు. అయితే ఓ పెద్ద పూరీ తినేందుకు ఆమె నోరు తెరవగా అది తిరిగి మూసుకోలేదు. చివరికి వైద్యులు చికిత్స చేసి దానిని సరి చేశారు. సడెన్‌గా, ఏదో పెద్ద ఫుడ్ ఐటమ్ తినేందుకు నోరు తెరవడంతో అలా అయ్యిందని చెప్పారు.

News December 1, 2025

42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు: సత్యకుమార్

image

AP: 2030నాటికి HIV రహిత రాష్ట్రమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ‘HIV పాజిటివిటీ రేటు 0.10 శాతం నుంచి 0.04 శాతానికి తగ్గింది. కొత్త కేసుల్లో ITఉద్యోగులు ఉండటం ఆందోళనకరం. సేఫ్ సెక్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. దాదాపు 42వేల మంది HIV బాధితులకు పెన్షన్లు ఇస్తున్నాం. త్వరలో మిగిలిన అర్హులైన వారికీ పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.