News March 24, 2025

గద్వాల్: కలెక్టర్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన

image

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్‌డీఎస్ రైతులు సాగు నీరు గత రెండు వారాల నుంచి ఇవ్వడం లేదని, పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, వెంటనే సాగు నీరు అందివ్వాలని సుమారు పన్నెండు గ్రామాల రైతులు కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు తమ సమస్యలు పరిష్కరించాలని తెలపగా సానుకూలంగా స్పందించారు.

Similar News

News November 16, 2025

జమ్మిచేడు రిజర్వాయర్‌లో గుర్తుతెలియని మృతదేహం

image

జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచేడు శివారులోని రిజర్వాయర్‌లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చని, నాలుగు రోజుల కిందట చనిపోయి ఉంటాడని పోలీసులు తెలిపారు. పసుపు రంగు టీ-షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే ఎస్ఐ శ్రీకాంత్ (87126 70296)కు ఫోన్ చేయగలరని తెలిపారు.

News November 16, 2025

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం: సీఐటీయూ

image

సిద్దిపేట కేంద్రంలోని కార్మిక వర్గ వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు అన్నారు. సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన సీఐటీయూ 4వ జిల్లా మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.

News November 16, 2025

ఆదోని జిల్లా సాధించి తీరుతా: ఎమ్మెల్యే పార్థసారథి

image

ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం పట్టణంలో చేపట్టిన నిరాహార దీక్షలో ఎమ్మెల్యే పార్థసారథి, కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, ఆదోని జిల్లాను సాధించి తీరుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే హామీపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.