News February 12, 2025

గద్వాల్: ఘనంగా భూలక్ష్మి చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం 

image

గద్వాల్ జిల్లా కేంద్రంలోని భూలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి లింగం బావిలో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారులు విగ్రహాలను లింగం బావిలో ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల హర్షధ్వానాల మధ్య విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు గద్వాల్ పట్టణ ప్రజలు భారీగా హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

Similar News

News February 12, 2025

‘తండేల్’ కలెక్షన్ల ప్రభంజనం

image

థియేటర్ల వద్ద ‘తండేల్’ మూవీ కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతోంది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ చిత్రం రూ.80.12 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. వాలంటైన్స్ వీక్‌లో బ్లాక్ బస్టర్ తండేల్‌పై ప్రేమ అన్‌స్టాపబుల్‌గా కొనసాగుతుందని పేర్కొంది. నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి.

News February 12, 2025

ఇక్ష్వాకు వంశంపై హరగోపాల్ ఏమన్నారంటే?

image

ఇక్ష్వాకుల గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. పురాణాల ప్రకారం రాముడిది ఇక్ష్వాకు వంశం. అలాగే, తెలుగునాట కూడా ఈ పేరుతో ఓ రాజవంశం ఉండేది. శాతవాహనుల తరువాత పాలించింది ఆంధ్ర ఇక్ష్వాకులు. ‘ఏ కులం వారైనా ఇక్ష్వాకులు అని చెప్పడానికి ఏ ఆధారమూ లేదు. ఈ వంశం ఇప్పటి వరకూ కొనసాగి, ఎవరో ఒకరు ఇంకా ఉన్నారని చెప్పే అవకాశం లేదు. ఎవరైనా చెప్పుకున్నా దానికి సాక్ష్యం ఉండదు’ అని ప్రొఫెసర్ హరగోపాల్ చెబుతున్నారు.

News February 12, 2025

జేఈఈ మెయిన్స్‌లో గుండాల విద్యార్థుల ప్రతిభ

image

ఎన్.టి.ఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్-2025 తొలి సెషన్ ఫలితాల్లో మారుమూల గిరిజన ప్రాంతమైన గుండాల గురుకుల కళాశాలకు విద్యార్థులు ప్రతిభ చూపారు. విద్యార్థులు డి.నరసింహ-78%, ఎన్.దేవిప్రసాద్-72%, జి.మనోహర్-58%, బి సతీశ్ కుమార్-57%, బి.గణేశ్-45% ఉత్తమ పర్సంటైల్ సాధించారు. కాగా విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ వి.సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్  రామచంద్రరావు, అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.

error: Content is protected !!