News February 12, 2025

గద్వాల్: ఘనంగా భూలక్ష్మి చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం 

image

గద్వాల్ జిల్లా కేంద్రంలోని భూలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి లింగం బావిలో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారులు విగ్రహాలను లింగం బావిలో ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల హర్షధ్వానాల మధ్య విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు గద్వాల్ పట్టణ ప్రజలు భారీగా హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

Similar News

News November 18, 2025

జనవరిలోనే WPL షురూ.. డేట్స్ ఇవేనా?

image

వచ్చే ఏడాది జనవరి 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3న ఫైనల్ జరిగే అవకాశం ఉందని Cricbuzz తెలిపింది. WPL-2026 కోసం నవీ ముంబై, వడోదర స్టేడియాలను ఎంపిక చేయొచ్చని తెలిపింది. ఫిబ్రవరిలో జరిగే T20 పురుషుల ప్రపంచకప్‌ను భారత్ కో-హోస్ట్ చేస్తుండటంతో WPLను ముందుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 26న వేదికలు, తేదీలు ఖరారు కానున్నాయి. 27న మెగా వేలం జరగనుంది.

News November 18, 2025

జనవరిలోనే WPL షురూ.. డేట్స్ ఇవేనా?

image

వచ్చే ఏడాది జనవరి 7 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 3న ఫైనల్ జరిగే అవకాశం ఉందని Cricbuzz తెలిపింది. WPL-2026 కోసం నవీ ముంబై, వడోదర స్టేడియాలను ఎంపిక చేయొచ్చని తెలిపింది. ఫిబ్రవరిలో జరిగే T20 పురుషుల ప్రపంచకప్‌ను భారత్ కో-హోస్ట్ చేస్తుండటంతో WPLను ముందుగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 26న వేదికలు, తేదీలు ఖరారు కానున్నాయి. 27న మెగా వేలం జరగనుంది.

News November 18, 2025

భద్రాద్రి కలెక్టర్‌కు జాతీయ స్థాయి అవార్డు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను, సౌత్ జోన్ 3లో ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. నేడు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డుతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతిని అందుకోనున్నారు. తెలంగాణలో ఎంపికైన ఆరు జిల్లాల్లో భద్రాద్రి ఒకటి.