News February 22, 2025
గద్వాల్ : తృటిలో తప్పిన పెను ప్రమాదం

జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రాయచూరు జిల్లాకు వెళ్లే మార్గంలో రోడ్డుకు పక్కన ఉన్న వెదురు బొంగుల గుడిసెలోకి శనివారం ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఆ సమయంలో వెదురు బొంగుల గుడిసెలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అక్కడ నిలిపి ఉన్న స్కూటర్ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్లో ప్రసంగించనున్న ప్రముఖులు

TG: ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్-2047 తొలి రోజు పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా మాట్లాడనున్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం ప్రారంభమయ్యే సమ్మిట్ 9న రాత్రి ముగియనుంది.
News December 6, 2025
ADB: ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో మూడు విడతల ఎన్నికల సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అబ్జర్వర్లు), జోనల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రతి సూక్ష్మ పరిశీలకులకు ఒక గ్రామ పంచాయతీని కేటాయిస్తామని, ఆ పరిధిలోని అన్ని వార్డులను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.
News December 6, 2025
WGL: 22 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి

హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైగా పదోన్నతి కల్పిస్తూ ఇన్ఛార్జ్ రేంజ్ డీఐజీ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి జోన్ పరిధిలోని వరంగల్, ఖమ్మం కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 22 మందికి పదోన్నతి కల్పించారు. ఈమేరకు జోన్ పరిధిలో వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.


