News April 18, 2025

గద్వాల్: బెట్టింగ్ భూతానికి ఎంటెక్ విద్యార్థి బలి

image

ఆన్‌లైన్ బెట్టింగ్‌ ఎంటెక్ విద్యార్థి ప్రాణాలు బలికొంది. ఎస్ఐ వివరాలు.. గద్వాలకు చెందిన పవన్(22) HYDలో ఎంటెక్ చేస్తున్నాడు. బెట్టింగ్‌లకు అలవాటు పడిన పవన్ వివిధ లోన్ యాప్‌ల నుంచి రుణాలు తీసుకుని ఆడుతూ డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ విషయమై తండ్రితో చెప్పగా రూ.98,200 పంపించాడు. అయినా అప్పులు తీరకపోవడంతో బైక్, ఐపోన్ అమ్మేశాడు. ఇంకా అప్పులు ఉండటంతో ఉరేసుకున్నాడు.

Similar News

News April 20, 2025

తాండూరులో సోమవారం ప్రజావాణి

image

తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని సిబ్బంది నవీన్ తెలిపారు. గత వారం హాలిడే సందర్భంగా ప్రజావాణి రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో గతవారం కొందరు వ్యక్తులు హాలిడే అని తెలియక ప్రజావాణి కార్యక్రమానికి వెళ్లి తిరిగి వెనక్కి వచ్చినట్టు తెలిపారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని కార్యాలయ సిబ్బంది తెలిపారు.

News April 20, 2025

జంగంపల్లిలో మల్బరీ తోటను సందర్శించిన రాష్ట్ర జాయింట్ డైరెక్టర్‌

image

బిక్కనూర్ మండలం జంగంపల్లిలోని మల్బరీ తోటను ఆదివారం రాష్ట్ర జాయింట్ డైరెక్టర్‌ లత సందర్శించారు. విత్తన క్షేత్రం 75 ఎకరాలు ఉందని జిల్లా పట్టుపరిశ్రమ అధికారి ఐలయ్య తెలిపారు. విత్తన క్షేత్రాన్ని పూర్తిగా ఆమె పరిశీలించారు. భూములు ఆక్రమణకు గురి కాకుండా ఫినిషింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూములు ఆక్రమణకు గురి అయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాంకేతిక అధికారి నాగేంద్రయ్య పాల్గొన్నారు.

News April 20, 2025

KMM: పేరెంట్స్ మందలించారని యువకుడి SUICIDE

image

తల్లిదండ్రులు మందలించారని కుమారుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) నేలకొండపల్లి(M) శంకరగిరి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ధరావత్ రాజు(24) ఏ పని చేయకుండా కాళీగా ఉంటున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యాంతమయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది.

error: Content is protected !!