News April 5, 2025
గద్వాల: అది దారుణం: BRS

గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని BRS రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం గద్వాలలో మీడియాతో ఆయన మాట్లాడారు. మండలంలో ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేసి ఇళ్లు కేటాయించడం దారుణమన్నారు. మిగిలిన గ్రామాల్లో అర్హులు లేరా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
Similar News
News October 16, 2025
మాదకద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు: వేణు

పెద్దపల్లి జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణు అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం అవసరమని అన్నారు. విద్యాసంస్థలు, హాస్టళ్లలో విద్యార్థుల అలవాట్లపై పర్యవేక్షణ ఉండాలన్నారు. గంజాయి సాగును అరికట్టేందుకు అటవీ శాఖతో పాటు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.
News October 16, 2025
పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన వాయిదా.!

పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన వాయిదా పడింది. ఈ నెల 16న మోదీ కర్నూలు పర్యటన, దాంతో పాటు వాడపల్లి బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో పోలీసు బలగాలు ఆ కార్యక్రమాలకు వెళ్లనున్నాయి. ఈ మేరకు దీపావళి అనంతరం రాజోలుకు పవన్ రానున్నట్లు MLA దేవ వరప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా కేశనపల్లి తీరంలో తోటల పరిశీలన, పల్లెపండుగలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
News October 16, 2025
ఐక్యరాజ్య సమితి అధికారులతో పెద్దపల్లి MP భేటీ

PDPL MP వంశీ కృష్ణ గడ్డం ఐక్యరాజ్య సమితి, ACABQ ఛైర్పర్సన్ జూలియానా గాస్పర్ రుయాస్, UN ఆర్థిక, బడ్జెట్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ చంద్రమౌళి రామనాథన్ను బుధవారం న్యూయార్క్లో కలిశారు. ఈ సమావేశంలో UN ఆర్థిక పరిస్థితి, ముఖ్యంగా శాంతి భద్రతా నిధులపై చర్చ జరిగింది. ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత్ కీలక పాత్రను మన దేశ ప్రతినిధులు పునరుద్ఘాటించారు. పారదర్శకత, బాధ్యత, సమర్థతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.