News February 28, 2025
గద్వాల: అమ్మాయి దక్కదని ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయి దక్కదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. రాజోళికి చెందిన నరేశ్ (20) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఏమైందో ఏమోకాని తనకు ఆ అమ్మాయి దక్కదని భావించి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News December 5, 2025
వరంగల్: ఏకగ్రీవ పల్లెల్లో కాంగ్రెస్ దే హవా..!

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3 విడతల ఎన్నికల ప్రక్రియ చకచకా సాగిపోతోంది. పార్టీ గుర్తులు లేనప్పటికీ, పల్లెల ఓటర్లు అభ్యర్థుల పార్టీ మద్దతును తెలుసుకుని ఓటు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 555 పల్లెల్లో 1,802 మంది పోలింగ్కు వెళ్లగా, 53 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. అందులో కాంగ్రెస్ 44, BRS 5, BJP 1, ఇతరులు 3 సర్పంచ్గా గెలిచారు. 4952 వార్డులకు 981 ఏకగ్రీవం కాగా.. 8676 మంది పోలింగ్కు వెళ్తున్నారు.
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు.. తొలి విడతలో 395 స్థానాలు ఏకగ్రీవం

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 4,236 సర్పంచ్ స్థానాలకు గాను 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 స్థానాలు ఉన్నాయి. అటు సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్లో 26 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. ఓవరాల్గా 5 గ్రామాల్లో నామినేషన్లు దాఖలవ్వలేదు. మిగిలిన 3,836 స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. కాగా మూడో విడత ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది.
News December 5, 2025
వరంగల్ స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం.. సీఎం దృష్టి పెడతారా?

ఎంపీ ఎన్నికల సందర్భంగా వరంగల్ అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్లో అనేక పనులు ఇంకా నిలిచిపోయాయి. మామునూరు ఎయిర్పోర్టు భూసేకరణకు రూ.150 కోట్లు, భద్రకాళి చెరువు పూడికతీత, మాడ వీధులు, స్మార్ట్సిటీ పనులు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ డీపీఆర్ సహా మొత్తం రూ.6,500 కోట్ల ప్రాజెక్టులు పురోగతి లేక నిలిచాయి. ఔటర్, ఇన్నర్ రింగ్రోడ్లు, మేడారం, గిరిజన వర్సిటీకి నిధులు త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు.


