News February 28, 2025
గద్వాల: అమ్మాయి దక్కదని ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయి దక్కదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. రాజోళికి చెందిన నరేశ్ (20) ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఏమైందో ఏమోకాని తనకు ఆ అమ్మాయి దక్కదని భావించి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News December 5, 2025
రెండో దశ ల్యాండ్ పూలింగ్కు రైతులు సానుకూలం: నారాయణ

AP: రాజధాని అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్కు రైతులు సానుకూలంగా ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని CM ఆదేశించినట్లు చెప్పారు. CRDA సమావేశంలో రూ.169కోట్లతో లోక్ భవన్, రూ.163కోట్లతో జ్యుడీషియల్ భవన్కు పాలనా అనుమతులు ఇచ్చామన్నారు. రూ.532 కోట్లతో నేషనల్ హైవేకు అనుసంధానం చేసే సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు ఆమోదం తెలిపామని ఆయన వివరించారు.
News December 5, 2025
MHBD: సర్పంచ్ అభ్యర్థులకు సవాలుగా కోతుల బెడద

సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరితో ముగిసింది. గ్రామాల్లో ప్రత్యేక అధికారులతో గ్రామపంచాయతీలు నడిచాయి. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కావడంతో MHBD జిల్లాలో ఫస్ట్, 2వ విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ముగిసింది. 3వ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో పాటు కోతులు, కుక్కల బెడద సర్పంచ్ అభ్యర్థులకు సవాలుగా మారింది. పరిష్కరిచిన వారికీ ఓట్లు వేస్తామని ఓటర్లు చెబుతున్నారు.
News December 5, 2025
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్

AP: రాష్ట్ర క్రికెట్ ఫ్యాన్స్ను విశాఖలో 2 నెలల వ్యవధిలో జరిగే 4 అంతర్జాతీయ మ్యాచులు అలరించనున్నాయి. డిసెంబర్ 6న ఇండియా, సౌతాఫ్రికా మూడో వన్డే విశాఖ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. Dec 21న INDWvsSLW మధ్య టీ20, Dec 23న ఈ రెండు జట్ల మధ్యే మరో టీ20 జరగనుంది. కొత్త ఏడాది జనవరి 28న INDvsNZ జట్లు టీ20 ఆడనున్నాయి. ఇలా వరుసగా ఇంటర్నేషనల్ మ్యాచులకు విశాఖ వేదిక కానుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


