News April 1, 2025

గద్వాల: అయిజకు రాష్ట్రంలో నాలుగో స్థానం..!

image

పన్ను వసూళ్లలో అయిజ మున్సిపాలిటీ రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచిందని కమిషనర్ సైదులు సోమవారం తెలిపారు. దీంతో అయిజ మున్సిపాలిటీ 15వ ఆర్థిక సంఘం నిధులు పొందేందుకు అర్హత సాధించిందని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1.82 కోట్లు లక్ష్యం నిర్దేశించుకుని, నేటికి రూ.1.62 కోట్లు వసూలు చేశామని తెలిపారు. ఇందుకు తమ కార్యాలయ సిబ్బంది విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు.

Similar News

News December 9, 2025

ఎన్యూమరేటర్లకు బెదిరింపులు.. ECIకు సుప్రీం నోటీసులు

image

SIR చేపట్టిన BLOలకు భద్రత కల్పించాలని దాఖలైన పిటిషన్లపై తమ వైఖరి తెలపాలని ECI, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. డోర్-టు-డోర్ సర్వేకు వెళ్లిన వారిని ముఖ్యంగా బెంగాల్‌లో అడ్డుకుంటున్నారని, బెదిరిస్తున్నారని వేసిన రెండు పిటిషన్లను CJI జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ బెంచ్ నేడు విచారించింది. పరిస్థితిని అదుపులోకి తేవాలని లేదంటే దారుణాలు జరుగుతాయని ECని CJI ఆదేశించారు.

News December 9, 2025

అన్నవరం ఈవో బదిలీ

image

అన్నవరం దేవస్థానంలో వరుస ఘటనలపై Way2Newsలో వార్తా కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ప్రభుత్వం ఈవో సుబ్బారావుపై వేటు వేసింది. ఆయనను మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు తిరిగి పంపింది. కొత్త ఈవోగా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ త్రినాధరావును నియమించింది. సుబ్బారావు సర్వీస్ వెనక్కి తీసుకోవడంతో ఆయనపై జరిగిన విచారణ నివేదికపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

News December 9, 2025

ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: నల్గొండ కలెక్టర్

image

నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను మంగళవారం ఆదేశించారు. కనగల్ ఎంపీడీవో ఆఫీస్, సాయిరాం ఫంక్షన్ హాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ పేపర్లు, బాక్సులను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల వారీగా సామాగ్రి సిద్ధం చేయాలని, బ్యాలెట్ పత్రాలు, బాక్సులు ప్రాపర్‌గా చెక్ చేయాలని సూచించారు.