News March 4, 2025

గద్వాల: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: హృదయరాజ్ 

image

గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హృదయరాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో మొత్తం 8,341 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా హాల్లోకి అనుమతించరని పేర్కొన్నారు.

Similar News

News March 25, 2025

కొమరాడ: తండ్రి మరణం.. పది పరీక్షకు కుమారుడు

image

కొమరాడ మండలం అల్లవాడ గ్రామానికి చెందిన బిడ్డిక రామారావు సోమవారం ఉదయం అకాల మరణం పొందారు. చరణ్ పెద్దకుమారుడు పదో తరగతి పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. తండ్రి మరణించిన బాధలోనే చరణ్ కన్నీరు పెట్టుకుంటూ గణితం పరీక్షకు వెళ్లాడు. పెద్దనాన్న కొడుకు బిడ్డిక సతీశ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 25, 2025

KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 25, 2025

39మంది ఎంపీలతో పీఎంను కలుస్తాం: స్టాలిన్

image

డీలిమిటేషన్ విషయంలో తమ రాష్ట్రానికి చెందిన 39మంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీని మీట్ అవుతామని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. ‘ఇటీవల ముగిసిన అఖిలపక్ష సమావేశంలో చేసిన తీర్మానాల ఆధారంగా తయారుచేసిన నివేదికను రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలందరితో కలిసి ప్రధానికి అందిస్తాం. తమిళనాడు పోరాటాన్ని ఆపదు. కచ్చితంగా ఈ పోరులో విజయం సాధిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.

error: Content is protected !!